ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కాకుండా విశాఖపట్నాన్ని ప్రపోజ్ చేసిన వైసీపీ పార్టీ నేతలు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గడ్డు కాలం మొదలు కాబోతోంది. ప్రపంచంలో ఎక్కడా మూడు రాజధానులు లేవని రాష్ట్రంతో మూడు ముక్కలాట ఆడుతున్నారని చంద్రబాబు జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ మాట తప్పడు.. మడమ తిప్పాడు అని… ముందు అమరావతి రాజధానిగా తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పిన జగన్ ఆ తర్వాత ముంపు ముప్పు ఉందని మరి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని అనేక కల్లబొల్లి మాటలతో రాజధానిని అమరావతి నుంచి షిఫ్ట్ చేస్తున్నారని అన్నారు
ఇకపోతే సీపీఐ జాతీయ నేత డి.రాజా మాట్లాడుతూ ఏపి నడిబొడ్డున ఉందని అమరావతిని రాజధానిగా అంతా ఎంచుకున్నారని… అనేక సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని అయితే జగన్ ఇప్పుడు అమరావతిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు. రాష్ట్ర రాజధాని విషయంలో జగన్ సంకుచిత ధోరణి పనికిరాదు అని హితవు పలికారు.
ఇలా చంద్రబాబు అమరావతి నే రాష్ట్ర రాజధానికి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకుని ఉద్యమం మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకే డి.రాజా కూడా అమరావతి ఉద్యమానికి తాము సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని అన్నారు. ఈ దీక్షను అమరావతిని సాధించేవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ విరమించేది లేదని చంద్రబాబు అనడం గమనార్హం.