”7000 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత తెలివైన రాక్షసుడు ఎలా ఉండేవాడో పరిచయం చేశారు.. ఆది పురుష్ టీమ్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న మూడు భారీ ప్రాజెక్ట్ లో ఆదిపురుష్ ఒకటి. ఈ సినిమాని దాదాపు 750 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతుండగా బాలీవుడ్ దర్శ దిగ్గజం ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా అదిపురుష్ లో ప్రభాస్ రాముడుగా కనిపిస్తాడని దర్శకుడే క్లూ ఇచ్చాడు. ఈ క్రమంలో ప్రభాస్ పక్కన సీత గా నటించబోయో హీరోయిన్ ని ఎంచుకునే పనిలో మేకర్స్ ఉన్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో ఉన్న పలువు స్టార్ హీరోయిన్స్ ని చిత్ర బృందం సీత పాత్ర కోసం పరిశీలిస్తున్నట్టు సమాచారం. వాస్తవంగా అయితే ప్రభాస్ కటౌట్ కి సరైన హీరోయిన్ కాని లేదా విలన్ గాని సెట్ చేయాలంటే చాల కష్టతరమైన విషయమేఅ అని చెప్పాలి. అయితే ప్రభాస్ కి జంటగా సీత పాత్ర లో నటింప చేసేందుకు కొన్ని పేర్లు ప్రముఖంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ని ఫైనల్ చేయడం తో ఈ సినిమా కి బాలీవుడ్ హీరోయిన్ ని ఎంచుకుంటారన్న టాక్ వినిపిస్తుంది.
ఈ క్రమంలోనే నయనతార, కీర్తి సురేష్ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే సీత పాత్రకి పూజా హెగ్డే, కియారా అద్వాని లని కూడా మరో ఆప్షన్ గా పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ కి పోటీగా నటించే మరో స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ని తాజా గా ఆది పురుష్ బృంద రివీల్ చేశారు. ఈ హీరో ని రివీల్ చేయగానే ఆది పురుష్ మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి.ఇక ఇందుకు సంబధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించబోతున్నట్టు సమాచారం.
ఇక ‘ఆదిపురుష్’ 3-డీ లో రూపొందనుండగా టీ-సిరీస్ భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ప్రభాస్ కెరీర్లో 22వ సినిమాగా రానున్న ‘ఆదిపురుష్’ 2021 లో చిత్రీకరణ ప్రారంభించి 2022లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. తెలుగు, హిందీ భాషల్లో నిర్మించి.. తమిళం – మలయాళం – కన్నడ భాషలలో పాటు పలు విదేశీ భాషల్లోకి డబ్ చేనున్నారట.