Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నికల వేళ బిగ్ షాక్ తగిలింది. గుంటూరులో పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. దీంతో కోర్టు ముందు హజరు కావాలని జిల్లా న్యాయమూర్తి శరత్ బాబు నోటీసులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే..ఏలూరు వారాహి యాత్రలో జూలై 3న పవన్ కళ్యాణ్..ఏపీ వాలంటీర్ల ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని, వాలంటీర్లు సేకరిస్తున్న వ్యక్తిగత డేటా బయటకు వెళ్లడం వల్లనే ఇందుకు కారణమని పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారు. అయితే.. ప్రభుత్వ పథకాలను సేవా భావంతో ప్రజలకు అందిస్తూ మన్ననలు పొందుతున్న వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని నాడు ఏపీ సర్కార్ సీరియస్ అయ్యింది.
మరో పక్క తాడికొండ మండలం కంతెరుకు చెందిన వాలంటీర్ పవన్ కుమార్ తో పాటు మరి కొందరు పోలీసులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పిర్యాదు చేశారు. ఏపీలో వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ వాలంటీర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు పవన్ కళ్యాణ్ పై ఐపీసీ సెక్షన్ 499, 500 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మార్చి 25న గుంటూరు కోర్టులో పవన్ కళ్యాణ్ హజరు కావాలని నాలుగో అదనపు జడ్జి శరత్ బాబు తాజాగా ఇచ్చిన నోటీసుల్లో స్పష్టం చేశారు.
MP Vijaya Sai Reddy: సంసద్ మహారత్న అవార్డు అందుకున్న ఎంపీ విజయసాయి రెడ్డి