Chandrababu: ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడబోనని హనుమ విహారి పెట్టిన సోషల్ మీడియా పోస్టు ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. వైసీపీ రాజకీయ కక్షలకు, ప్రతీకార రాజకీయాలకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లొంగిపోవడం సిగ్గుచేటని చంద్రబాబు ఖండించారు.
ప్రతిభావంతుడైన క్రికెటర్ హనుమ విహారి .. ఆంధ్రప్రదేశ్ తరపున ఎప్పటికీ ఆడబోనని ప్రకటించేలా వేధించారని చంద్రబాబు ఆరోపించారు అతడికి తాము అండగా ఉండి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. విహారి ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఆట పట్ల అతడికి ఉన్న చిత్తశుద్ది వైసీపీ కుట్ర రాజకీయాలు నీరుగార్చలేవు, అన్యాయమైన చర్యలను ఏపీ ప్రజలు ప్రోత్సహించరు అని పేర్కొన్నారు.
హనుమ విహారి ఉదంతంపై ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్పందించింది. ఆంధ్రా క్రికెట్ సంఘం ఆటగాళ్లందరినీ సమానంగా చూస్తుందని, సీనియారిటీ ఆధారంగా ఆటగాళ్లకు అనుకూలంగా వ్యవహరించడం గానీ లేకపోతే వారికి ప్రాధాన్యత ఇవ్వడం గానీ జరగదని వివరణ ఇచ్చింది. బెంగాల్ తో రంజీ మ్యాచ్ సందర్భంగా ఓ ఆటగాడిని హనుమ విహారి అందరి ముందు వ్యక్తిగతంగా దూషించాడన్న విషయం మా దృష్టికి వచ్చిందని తెలిపింది.
జాతీయ బాధ్యతల నేపథ్యంలో సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండేనంటూ విహారి తెలుపడంతో అతడి స్థానంలో కొత్త కెప్టెన్ ను నియమించామని, సీనియర్ బ్యాట్స్ మన్ రికీ భుయ్ ని కొత్త కెప్టెన్ గా నియమిస్తున్నట్లు అప్పట్లో సెలక్షన్ కమిటీ తెలిపింది. ఈ నిర్ణయం పట్ల హనుమ విహారి కాడ హర్షం వ్యక్తం చేశాడని తెలిపింది.
Fire Accident: గాజువాకలోని ఆకాశ్ బైజూస్ విద్యా సంస్థలో అగ్ని ప్రమాదం .. భారీగా ఆస్తి నష్టం