Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య పూర్తి చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు. కేవలం వారం రోజులు అయితే ఆచార్య నుంచి చిరు బయటకి వచ్చేస్తారు. ఆ తర్వాత పెద్ద గ్యాప్ తీసుకోకుండానే మలయాళ సూపర్ హిట్ సినిమా లూసీఫర్ తెలుగు రీమేక్కి రెడీ కానున్నారు. ఇప్పటికే పక్కాగా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ పూర్తి చేసి సెట్స్ మీదకి వచ్చేందుకు రెడీగా ఉంది చిత్ర బృందం. వీలైనంత స్పీడ్గా ఈ సినిమాను కంప్లీట్ చేసి 2022 సంక్రాంతి రేస్లో దింపాలని మెగాస్టార్ మేకర్స్కి చెప్పినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ స్వయంగా చెప్పారంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా 2022లో రావడం పక్కా అని అంటున్నారు.
అయితే లేటెస్ట్ గా మరో న్యూస్ వినిపిస్తోంది. తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాదిరిగా మెగాస్టార్ కూడా ఒకేసారి రెండు సినిమాలను మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో కూడా మెగాస్టార్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నారు. ఈ రెండు సినిమాలను చిరంజీవి సమాంతరంగా పూర్తి చేయడానికి డేట్స్ సర్దుబాటు చేశారట. మోహన్ రాజా, బాబీ సినిమాలను పూర్తి చేయడానికి మేకర్స్ కూడా రెడీ అయ్యారు.
Chiranjeevi : ఆచార్య సినిమాను విజయదశమి పండుగ సందర్భంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
ఈ సినిమాల తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాలం రీమేక్ సినిమాలో నటించబోతున్నారు. అంతేకాదు మెగాస్టార్ మరికొన్ని సినిమాలకి ఓకే చెప్పనున్నారని సమాచారం. వీరిలో వి.వి వినాయక్, పూరి జగన్నాథ్, త్రివిక్రం శ్రీనివాస్ లాంటి వాళ్ళు కథలు సిద్దం చేసుకొని రెడీగా ఉన్నారు. మరి ఆ తర్వాత చిరు చేయబోయే సినిమాలకి దర్శకుడుగా ఎవరిని ఎన్నుకుంటారో..ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి. కాగా ఆచార్య సినిమాను విజయదశమి పండుగ సందర్భంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మెగా పవర్ స్టార్ రాం చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు.