Corona Vaccine Good News: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కరోనా కట్టడి చర్యలకు వ్యాక్సిన్ కొనుగోలు, ఆసుపత్రుల్లో సదుపాయాలు, ఆక్సిజన్, మందుల సరఫరా రాష్ట్రాలకు భారంగా మారుతున్నాయి. వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీల నుండి రాష్ట్రాలు నేరుగా టీకా డోసులు కొనుగోలు చేసుకోవడానికి ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉత్పత్తికంపెనీల్లో ఒకటైన సెరమ్ ఇన్సిట్యూట్ ప్రభుత్వానికి ఒక డోసుకు రూ.400లుగా నిర్ణయించింది.
అయినప్పటికీ పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్పత్తి కంపెనీల నుండి కొనుగోలు చేయడానికి సిద్ధం అవుతూ టీకాలకు ఆర్డర్ పెడుతున్నాయి. వ్యాక్సిన్ కొనుగోలు రాష్ట్రాలకు భారంగా మారుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా అందించాలని నిర్ణయించింది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను రూ.150లు చొప్పున కేంద్రం ఉత్పత్తి కంపెనీల నుండి కొనుగోలు చేయనున్నది. కొనుగోలు చేసిన వ్యాక్సిన్ లను రాష్ట్రాలకు ఉచితంగా అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది.