Food Habits: మనం రోజూ తినే ఆహారంలో లో కొన్ని పదార్థాలు టెస్ట్ కోసం కలుపుకొని తింటాం.. మరికొన్ని పదార్థాలను కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తినడం మనకు ఇష్టం.. కొన్ని కొన్ని ఆహార పదార్థాలు కొన్ని పదార్థాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చేటు.. కొన్ని ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో స్లో పాయిజన్ గా మారి చనిపోయే అవకాశం లేకపోలేదు.. మరి ఎటువంటి ఆహార పదార్థాలను ఏ పదార్థాలతో కలిపి తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
పాలు:
పాలు తాగిన వెంటనే పండ్లు తీసుకోకూడదు. పాలు తాగిన వెంటనే ముఖ్యంగా కమలా పండు అస్సలు తీసుకోకూడదు.. పాలతో కలిపి పండ్లను తీసుకోవడం వల్ల ముక్కు, గొంతు, చెవి సమస్యలు బాధిస్తాయి. పాలలో ఉన్న క్యాల్షియం, పండ్ల లో ఉన్న చక్కెర్లు త్వరగా పై సమస్యలు వచ్చేలా చేస్తాయి. అలాగే పాలతో కలిపి ఆకుకూరలు తీసుకోకూడదు.. కొంతమందికి కూరలలో పాలుపోసి ఉండటం అలవాటు.. పాలలో ఉప్పు కలవడం ద్వారా పాలు విరిగి పోయి దాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం అందవలసిన ఆక్సిజన్ కలుషితమవుతుంది దీనివలన శరీరంలో చెడు రక్తం పెరిగిపోయి ప్రమాదకరమైన జబ్బులకు దారితీస్తుంది. చేపల కూర పాలు పోసి ఉండకూడదు. పాలు పోయడం ద్వారా కొరకు నుంచి వచ్చినప్పటికీ ఆరోగ్యానికి చాలా ప్రమాదం.. శరీర చర్మ రంధ్రాలను దెబ్బతీసి అది క్రమంగా కుష్టు వ్యాధి సోకేలా చేస్తుంది.. పాలతో పండ్లు, ఆకుకూరలు, చేపలు కలిపి తీసుకోకూడదు..
తేనె, నెయ్యి:
తేనె, నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకోవటం ఆరోగ్యానికి ముప్పు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఈ రెండింటినీ సమాన నిష్పత్తిలో కలిపి తీసుకోవటం వలన తేనెకు, నెయ్యికి రసాయన చర్య జరిగి స్లో పాయిజన్ గా మారుతుంది.. ఇది ఆరోగ్యాన్ని హని చేస్తుంది.
పెరుగు, మాంసం :
ఎక్కువమంది మాంసాహారం వండేటప్పుడు అందులో రుచి కోసం పెరుగు వేస్తూ ఉంటారు. మరి కొంతమంది వేపుడు చేసేటప్పుడు పెరుగు తో కలిపి ముక్కల్ని నానబెడతారు. పెరుగుతో మాంసం లో ఉన్న కొవ్వు పదార్థాలు రసాయన చర్య జరిపి అవి శరీరంలో చెడు కొవ్వు తయారయ్యేలా చేస్తాయి. దీని వలన గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది.
అరటిపండు, పెరుగు:
చాలామందికి పెరుగు అన్నం తినేటప్పుడు అరటికాయ తినడం అలవాటు.. అయితే ఈ అలవాటు వలన ఆరోగ్యానికి హాని అంటున్నారు వైద్య నిపుణులు.. ఈ రెండు పదార్ధాలు కలిపి తీసుకోవడం వలన జీర్ణాశయం దెబ్బతింటుంది. అలాగే చర్మ సంబంధ వ్యాధులు వస్తాయి. వీటితోపాటు గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి..
చపాతీలు, పూరీలు:
గోధుమలు ఆరోగ్యానికి మంచి చేస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. మరికొంతమంది బరువు తగ్గడం కోసం అన్నం బదులు చపాతీలు తీసుకుంటారు. గోధుమ పిండితో చపాతీలు, పూరీలు తినడం వల్ల మనకు ఫైబర్ ను త్వరగా కరిగి గ్లూకోజ్ మారేలా చేస్తుంది. అన్నం లో కంటే ఎక్కువ గ్లూకోజ్ చపాతీల ద్వారా మన శరీరం లోకి చేస్తోంది. పూరిల ద్వారా మరింత ద్వారా చేరుతుంది. కాబట్టి ఈ రెండు పదార్థాలను ఒకేసారి కలిపి తీసుకోకండి. రుచి కోసం కొన్ని పదార్థాలు కలిపితే ఆరోగ్యానికి ఎంత ముప్పు తెలుసుకున్నారు కదా ఇక నుంచి అయినా ఈ పదార్థాలను కలిపి తీసుకోకండి..