Pawan kalyan : పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా చిత్రం అయ్యప్పనుం కోషియం కి తెలుగు రీమేక్. భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సాగర్ చంద్ర దర్శకుడనగానే కొన్ని అనుమానాలు అభిమానుల్లో తలెత్తాయి. అందుకు కారణం వకీల్ సాబ్ సినిమాకి దర్శకుడు వేణు శ్రీరాం అంతక ముందు తీసిన రెండు సినిమాలు భారీ హిట్స్ కాదు. అలాగే సాగర్ చంద్ర భారీ కమర్షియల్ హిట్స్ కూడా లేవు.
అయినా పవన్ కళ్యాణ్ ఎలా అవకాశం ఇచ్చాడు అన్నది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. అయితే పవన్ కళ్యాణ్ టాలెంట్ ని నమ్మే వ్యక్తి. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది. అందుకే వేణు శ్రీరాం, సాగర్ చంద్ర లకి దర్శకత్వం వహించే బాధ్యత అప్పగించాడు. పవన్ అయితే అయ్యప్పనుం కోషియం సినిమా తెలుగు రీమేక్ సినిమా చేయడానికి కారణం త్రివిక్రం అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పవన్ చేస్తే బావుంటుందని త్రివిక్రం చెప్పడం వల్లే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
Pawan kalyan : అందుకే త్రివిక్రం ఈ ప్రాజెక్ట్ అన్నీ తానై చూసుకుంటున్నట్టు తెలిపాడు.
అంతేకాదు ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ త్రివిక్రం అందిస్తుండటం తో పాటు దర్శకత్వ పర్య వేక్షణ కూడా చేస్తున్నాడు. ఇలా ఎందుకు అన్న ప్రశ్న తలెత్తిన సంగతి తెలిసిందే. దానికి తాజాగా నిర్మాత సూర్య దేవర నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు. పవన్ – రానా ల మల్టీ స్టారర్ కి ఎవరైనా సీనియర్ దర్శకుడు ఉంటే సాగర్ చంద్ర కి సపోర్ట్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. అందుకే త్రివిక్రం ఈ ప్రాజెక్ట్ అన్నీ తానై చూసుకుంటున్నట్టు తెలిపాడు.