తమిళ్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా తలకెక్కిన సినిమా “దీ వారియర్”. ఈనెల 14వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో ఇటీవల హీరో రామ్ తో పాటు హీరోయిన్ కృతి శెట్టి పాల్గొనడం జరిగింది. బిత్తిరి సత్తికి సినిమాకి సంబంధించి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా “ఇస్మార్ట్ శంకర్” సినిమా ప్రస్తావన వీరి మధ్య వచ్చింది. “ఇస్మార్ట్ శంకర్” లాగా మాట్లాడటం అనేది బ్లైండ్ గా కథ విన్నాక ఫిక్స్ అయిపోయాను. సో సినిమా చేస్తున్నంతసేపు నేను పెద్దగా ఇబ్బంది పడలేదు. ఇప్పుడు మీరు వెరైటీగా మాట్లాడుతున్నారు అందువల్లే మీరు బిత్తిరి సత్తి అయ్యారు. లేకపోతే తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తులాగా అందరిలాగా ఉండేవాళ్లు. “ఇస్మార్ట్ శంకర్” లో కథలో ఉన్న ఆ ఐడెంటిటీ మొత్తం తెలుసుకున్నాక ఆ విధంగా మాట్లాడాను.
ఇక స్టోరీ విన్నాక ఆ సినిమా ఇండస్ట్రీలో కేవలం పూరి జగన్నాథ్ తప్ప మిగతా వాళ్ళు చేయలేరని నేను బాగా ఫిక్స్ అయ్యాను. ఆయన ఏంటో నాకు బాగా తెలుసు. కెరియర్ పరంగా అప్సన్ డౌన్స్ ఉంటాయి. నాకు మాత్రం అవేమీ కనబడలేదు. పూరి జగన్నాథ్.. సత్తా ఉన్న డైరెక్టర్ తెలుగులో ఉన్న దర్శకులలో బెస్ట్ డైరెక్టర్. ఈ క్రమంలో ఇదే విషయాన్ని పూరి జగన్నాథ్ కూడా చెబుతారు అంటూ బిత్తిరి సత్తి తెలిపారు. నిజంగా నా దగ్గర ఎటువంటి విజయం లేదు అటువంటి టైంలో నన్ను రాం నమ్మాడు.., హీరో రామ్ లేకపోతే “ఇస్మార్ట్ శంకర్” లేదు.. అంటూ చాలా ఇంటర్వ్యూలలో పూరి చెప్పుకొచ్చారు.
అయితే ఈ “ఇస్మార్ట్ శంకర్” లో పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది దాన్నిబట్టి.. “ది వారియర్” ఒప్పుకున్నారా అని రామ్ నీ ప్రశ్నించారు. లేదు పోలీస్ క్యారెక్టర్ చేయాలి అని ఎప్పటినుండో ఉంది. అయితే కొత్తదనం ఉండాలి అని వెయిట్ చేస్తే.. ఈ సినిమా దొరికింది అందువల్లే దివారియర్ చేశాను. ఇందులో పోలీస్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించాను అంటూ తనదైన శైలిలో రామ్ చెప్పుకొచ్చారు.