గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గన్నవరం అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అన్ని ప్రాంతాలను సమంగా చూడాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, లేదంటే తెలంగాణ తరహాలో అసమానత ఉంటుందని చెప్పారు.
అలాగే ప్రస్తుతం అమరావతిపై లక్ష కోట్లు ఖర్చుపెట్టే పరిస్థితి లేదని అన్నారు వంశి. ఇక మరోవైపు గన్నవరం ఉప ఎన్నికకు తను సిద్ధంగా ఉన్నానని తెలియజేసారు. ఇదే విషయాన్నీ జగన్ గారికి కూడా చెప్పినట్లు తెలియజేసారు.కేవలం కరోనా కారణంగా ఇప్పుడు ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని అందుకే ఆగానని చెప్పుకొచ్చారు.
అయితే ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.రాజధాని తరలింపు విషయంలో తన ప్రాంత రైతులు కొంత నష్టపోయిన మాట నిజమేనని, అయితే గన్నవరం ఉపఎన్నికను, రాజధాని తరలింపుకు ముడిపెట్టాలా వద్దా అన్నది టిడిపి నేతలే తేల్చుకోవాలని చెప్పుకొచ్చారు.