Petrol: మోదీ సర్కార్ దీపావళి కానుకగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీ ఎత్తున తగ్గించిన విషయం తెలిసిందే. ఎప్పుడూ రూపాయిల్లో పెంచి.. పైసల్లో తగ్గించే మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఒకేసారి పెట్రోల్ (petrol), డీజిల్ (diesel)పై వరుసగా రూ.5, రూ.10 చొప్పున తగ్గించడంతో ప్రజలందరూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
Modi: టీకా పంపిణీలో 100 కోట్ల.. మైలురాయి సాధించిన నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక ప్రసంగం…!!
60 రూపాయలకే లీటర్ పెట్రోల్
అయితే మోదీ ప్రభుత్వం మరోసారి చమురు తగ్గింపు విషయంలో సంచలన నిర్ణయం తీసుకోబోతోందని విశ్వసనీయ సమాచారం. త్వరలోనే బీజేపీ (BJP)ప్రభుత్వం లీటర్ పెట్రోల్ ధరను రూ.60కే వినియోగదారుడికి అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
CAG : సీఏజీ నోటిఫికేషన్.. భారీగా ఖాళీలు.. దరఖాస్తు చేసుకోండిలా..
అంతే లేకుండా నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అటు వినియోగదారులు.. ఇటు ప్రజా, సరుకు రవాణా వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. సంపాదించిన ఆదాయం మొత్తం పెట్రోల్ కే ఖర్చు పెట్టాల్సి వస్తోందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బీజేపీ పార్టీలు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఘోర ఓటమి చవి చూస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మోదీ ఘోరంగా పరాజయం పాలయ్యే అవకాశం ఉందని కూడా రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎటు చూసినా ప్రజా వ్యతిరేకం వెల్లువెత్తుతోంది. దాంతో మోదీ సర్కార్ (Modi sarkar) తన తప్పులను సరిదిద్దు కోవడానికి చర్యలు చేపడుతోంది.
స్థిరమైన పెట్రోల్ రేట్లు
అంతర్జాతీయ స్థాయిలో చమురు కొంచెం పెరిగితే చాలు.. ఇష్టారాజ్యంగా పెంచుతూపోయే మోదీ ఇప్పుడు తగ్గించాలని ఆలోచనలు చేస్తున్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా తగ్గకపోయినా దేశంలో పెట్రోల్ ధరలు ఒకే విధంగా ఉండేలా కొత్త విధానం తీసుకురావాలని భాజపా ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది.
బ్రేకింగ్: ఏపీలో పెట్రోల్, డీజిల్ పై సెస్సు విధించిన ప్రభుత్వం
అలాగే ఇథనాల్ బ్లెండింగ్ ఈ ప్రక్రియను పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఇంధనం, చమురు విషయంలో భారత ప్రజలకు అన్ని వైపులా ప్రయోజనాలు అందించి సమర్థవంతమైన పాలన అందించాలని కేంద్ర ప్రభుత్వం (central government) యోచిస్తోంది.