Kamal Haasan: దృశ్యం-2 సినిమా దర్శకుడు జీతూ జోసెఫ్ కి విశ్వనాయకుడు కమల్ హాసన్ ఒక విజ్ఞప్తి చేశారని తమిళ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.ఆయన విజ్ఞప్తి కూడా ఆసక్తికరంగా ఉంది.దృశ్యం-2 సినిమాను తమిళంలో రీమేక్ చేస్తే తన పక్కన హీరోయిన్ గా గౌతమిని మాత్రం పెట్టవద్దంటూ కమల్ హాసన్ ఆ చిత్ర దర్శకుడిని కోరుకున్నారట. మీనా లేదా మరెవరైనా సరే తనకు అభ్యంతరం లేదని గౌతమి మాత్రం వద్దని ఆయన తెగేసి చెప్పారట.
“దృశ్యం” ఒక సంచలనం!
జీతూ జోసెఫ్ మలయాళంలో మోహన్ లాల్ మీనా లతో నిర్మించిన దృశ్యం అద్భుత విజయాన్ని నమోదు చేసింది.దాన్ని శ్రీప్రియ దర్శకత్వంలో తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేశారు.మీనాతో సహా మిగిలిన తారాగణాని అంతా అలాగే ఉంచేశారు.తెలుగులో కూడా ఈచిత్రం ఘనవిజయం సాధించింది.తమిళంలో కూడా ఈ చిత్రాన్ని పాపనాశం పేరుతో కమల్ హాసన్ తో రీమేక్ చేశారు.హీరోయిన్ గా మీనాని కాకుండా అప్పట్లో కమల్ హాసన్ తో సహజీవనం చేస్తున్న గౌతమిని ఉంచారు.కట్ చేస్తే దృశ్యం2 కూడా వచ్చేసింది.ఇది కూడా సూపర్ హిట్టయింది.తెలుగులో వెంటనే వెంకటేష్ జీతూ జోసెఫ్ డైరెక్షన్లోనే రీమేక్ కూడా చేశారు.మలయాళ తారాగణాన్ని ఏమాత్రం మార్చలేదు.విడుదలకు సిద్దంగా ఉన్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది.
Kamal Haasan: కమల్ హాసన్ ప్రాబ్లం ఏంటంటే?
దృశ్యం-2 సీక్వెల్ చిత్రం కాబట్టి తమిళంలో ఇంతకుముందు దృశ్యంలో నటించిన తారాగణాన్ని కొనసాగించాలని దర్శకుడు భావిస్తున్నారు.అదే కమల్ హాసన్ కు ఇబ్బంది కలిగిస్తోంది.గౌతమి, కమల్ హాసన్ లు ఇప్పుడు విడిపోయారు.విడివిడిగా ఉంటున్నారు.ఈ నేపధ్యంలో దృశ్యం-2 లో గౌతమి తో కలిసి నటించడానికి కమల్హాసన్ ఇష్టపడడం లేదు.ఇదే విషయాన్ని కమల్ హాసన్ దర్శకుడు జీతూ జోసెఫ్ కు స్పష్టంగా చెప్పేశారని తమిళ పత్రికలు రాస్తున్నాయి.గౌతమి మాత్రం వద్దని… మీనా లేక మరెవరినైనా పెట్టుకోమని ఆయన కోరారంటున్నారు.కానీ సీక్వెల్ చిత్రం కాబట్టి దీనికి దర్శకుడు ఒప్పుకునే అవకాశాలు తక్కువ .హీరోయిన్ ను మారిస్తే కంటిన్యుటీ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.మరి ఈ పరిస్థితుల్లో జీతూ జోసెఫ్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.కమల్ హాసన్ మాటను ఆయన వింటారా లేక సీక్వెల్ ని నిలుపు చేస్తారా అన్నది చర్చనీయాంశమైంది .