తమిళనాడు రాజకీయాలలో కమల్ హాసన్ రజిని ఎంట్రీ అవటంతో వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశం ఫోకస్ పడింది. చాలా వరకు తమిళ రాజకీయాలను సినీ తారలు ప్రభావితం చేయటంతో జయలలిత కరుణానిధి మరణాలతో మొన్నటి వరకూ చప్పగా నడిచిన అరవ రాజకీయాలు.. ఇద్దరి దిగ్గజ నటుల ఎంట్రీతో ఒక్కసారిగా వేడెక్కాయి.
రజినీకాంత్ ఈనెల ఆఖరి లో కొత్త పార్టీకి సంబంధించి విధివిధానాలు అన్ని విషయాలు వివరించనున్నారు. ఇదిలా ఉండగా రజనీ కంటే ముందే చాలావరకు యాక్టివ్ గా ఉన్న కమల్ హాసన్ సరిగ్గా ఎన్నికల ముందు పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా కాకుండా ఎంఐఎం తో పొత్తు పెట్టుకుని తప్పటడుగు వేసినట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మేటర్ లోకి వెళితే పొలిటికల్ సర్కిల్స్ లో తల పండిపోయిన రాజకీయ నేతలు చాలావరకు మెజారిటీ, మైనారిటీ ఓట్లు తమ పరిధిలోని ఉండేలా తెలివిగా వ్యవహరిస్తారు. మెజార్టీ వర్గానికి చెందిన ఓట్లను కులాల వారీగా చీలుస్తూ ఎత్తుగడలు వేసుకుంటూ పోతారు. మైనారిటీలకు ఎటువంటి ఆపద వచ్చినా ప్రధాన పార్టీలు చాలావరకూ వాటిని హ్యాండిల్ చేస్తూ ఇతర పార్టీల ఓటు బ్యాంకుకి చిల్లు పెడతారు. అయితే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కమల్ హాసన్ కి ఇంకా రాజకీయాలు వంటబట్టలేదు ఏమో ప్రారంభంలోనే మైనార్టీ పార్టీ దేశ ప్రజల దృష్టిలో ముద్రపడ్డ ఎంఐఎం తో పొత్తు పెట్టుకుని అట్టర్ ఫ్లాప్ నిర్ణయం తీసుకున్నట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తల పండిపోయిన రాజకీయ నేతలు పోలరైజేషన్ రాజకీయాలు మైనార్టీ వర్గాలలో, డివిజన్ పాలిటిక్స్ మెజార్టీ వర్గాలలో చేసుకుంటూ పోతూ రాజకీయాల్లో రాణించే ఇలాంటి తరుణంలో తమిళనాడు రాజకీయాలలో అతి తక్కువ ప్రభావితం చేసే మైనార్టీ వర్గాల తో కమల్ పొత్తు అట్టర్ ఫ్లాప్ నిర్ణయమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కారణం ఇదే సమయంలో రజనీ హిందుత్వ స్ట్రాటజీ తో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతుండటంతో కచ్చితంగా కమల్ పార్టీ కి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ పరంగా భారీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.