దుబ్బాక అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబటక పోవటంతో టిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఉన్న కొద్ది తగ్గుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో కేసీఆర్ రంగంలోకి దిగి ఇటీవల సిరిసిల్ల నియోజకవర్గంలో భారీ స్థాయిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది.
కాగా తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 వేల పోస్టుల బర్తి కి టిఆర్ఎస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. టీచర్ అదేవిధంగా పోలీస్ శాఖ కు సంబంధించిన పోస్టులను భర్తీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ రెండు శాఖలకు సంబంధించినవి మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మిగతా శాఖలకు సంబంధించిన పోస్టులను భర్తీ చేయటానికి టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏఏ శాఖ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్క తేల్చాలని పేర్కొన్నారు. అన్ని వివరాలు సేకరించిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారు కేసీఆర్. ఇదిలా ఉండగా చాలా రోజుల నుండి టీచర్ల పోస్టుల భర్తీ అవటం లేదని ఆందోళనలు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఈసారి టీచర్ల పోస్ట్ ల భర్తీకి కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకోవటం అనే వార్త రావడంతో తెలంగాణ నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.