Alcohol:మద్యపానం మీద తాజాగా చేసిన ఓ అధ్యయనం యూత్ తో పాటు తాగుబోతులకు కూడా ఒక హెచ్చరిక లా ఫలితాలు ఉన్నాయి . వారానికి 20నుండి 40 గ్లాసు ల బీరు ను తాగేవారు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తేల్చిచెప్పింది .ప్రతి రోజూ మోతాదు మించ కుండా మద్యం లేదా వైన్ తాగితే పది కాలాల పాటు ఆరోగ్యం గా ఉంటారని అనేక పరిశోధనలు తెలియచేస్తున్నాయి. కానీ, తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం మాత్రం ప్రాణ ముప్పు తప్పదని హెచ్చరిస్తోంది.
వారానికి కేవలం 100 గ్రాములు అంటే దాదాపు ఐదు గ్లాసు ల వైన్, 9 గ్లాస్ల బీర్ను మాత్రమే పుచ్చుకున్నా అకాల మరణం రాక తప్పదని మెడికల్ జర్నల్ ది లాన్సెట్ స్పష్టం చేసింది.మెడికల్ జర్నల్ ది లాన్సెట్ పత్రిక వెల్లడించిన దాని ప్రకారం 19 దేశాల్లోనుండి ఆరు లక్షల మంది మద్యం ప్రియుల పై ఈ పరిశోధన చేయగా , మద్యాన్ని ఎక్కువగా సేవించే వారు గుండెపోటు, గుండె వైఫల్యం వంటి తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే ముప్పు ఎక్కువశాతం ఉందని… ముఖ్యంగా, వారానికి 200 గ్రాముల నుంచి 350 గ్రాములు అంటే వారానికి 10 నుంచి 18 గ్లాసుల వరకూ వైన్, 20 నుంచి 40 గ్లాసుల వరకూ బీరును తీసుకునే వారు సగటు జీవితకాలం లో రెండేళ్ల ముందే మృత్యువాతన పడతారని తెలిసింది .
ప్రపంచవ్యాప్తం గా మద్యం సేవించడంపై ఉన్న అధికారిక గైడ్లైన్స్ను సవరించాల్సిన అవసరం ఉందని ది లాన్సెట్లో ప్రచురితమైన అథ్యయనం తెలియచేస్తుంది . ఇక ప్రతి వారం ఆరు గ్లాస్ల వైన్, అదే మోతాదు లో బీర్ను తీసుకోవాలని, అంతకు మించి మద్యం తాగితే ,ఆరోగ్యానికి ముప్పు తప్పదని ఇటీవల బ్రిటన్ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.