Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి భీమ్లా నాయక్ సినిమాను రెడీ చేస్తున్న పవన్ ఆ తర్వాత వీరమల్లు మూవీ చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు. భీమ్లా నాయక్ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. రానా మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్. ఇక క్రిష్ దర్శకత్వంలో ఇప్పటికే దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తైన హరి హర వీరమల్లు మళ్ళీ సెట్స్ మీదకు రానుంది.
ఈ సినిమా షూటింగ్ జరిపేందుకు మేకర్స్ రాజస్థాన్లో లొకేషన్స్ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, జాక్విల్ ఫెర్నాండస్ హీరోయిన్స్గా అర్జున్ రాం పాల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక హరీష్ శంకర్ సినిమాను సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నారు పవర్ స్టార్. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
Pawan kalyan: ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్కు చెక్ పెట్టినట్టైంది.
అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పవన్ అత్యంత సన్నిహితుడు రాం తాళ్ళూరి ఈ సినిమాకు నిర్మాత. అయితే తాజాగా ఈ సినిమా జీ వారికి వెళ్ళిపోయిందని టాక్ వెళ్ళిపోయింది. రాం తాళ్ళూరి నుంచి చేతులు మారిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవం లేదట. పవన్ – రాం తాళ్ళూరి – సురేందర్ రెడ్డి సినిమా ఓటీ, శాటిలైట్ రైట్స్ మాత్రమే జీ వారు దక్కించుకున్నారు. వారి సినిమాను నిర్మించడం లేదు. ఇదే విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. దాంతో ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్కు చెక్ పెట్టినట్టైంది.