Senior NTR: ” ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ ” సినిమాతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న పూజిత గుర్తుందా? ఈమె ప్రస్తుత కాలంలో కూడా యూట్యూబ్ ఛానల్స్ కి పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంది. ఇక ప్రస్తుతం ఈమెకి పెద్దగా సినిమా అవకాశాలు దక్కడం లేదు. అందువల్లనే యూట్యూబ్స్ కి ఇంటర్వ్యూ ఇస్తుంది. ఇక తాజాగా మాటీవీలో ప్రసారమవుతున్నటువంటి ఓ సీరియల్ లో ఈమె నటిస్తుంది.
ఒకానొక సమయంలో తన భర్త మోసం చేశాడంటూ పూజిత అతనిపై కేసు పెట్టి వార్తల్లో నిలిచింది. అనంతరం మరో ఐఏఎస్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకుంది అంటూ ప్రచారం కూడా జరిగింది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్టీ రామారావు రెండో భార్య లక్ష్మి పార్వతి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో మరోసారి వార్తల్లో నిలిచింది పూజిత.
ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ..” ఎన్టీఆర్ మరణించిన సమయంలో నేను చూసేందుకు వెళ్లాను. అయితే అప్పుడు లక్ష్మి పార్వతి గారు ఒక దగ్గర దర్జాగా కూర్చుని టీ తాగుతున్నారు. అయితే అదే సమయంలో అక్కడికి నరసింహారావు గారు రావడంతో లక్ష్మి పార్వతి పడి పడి ఏడ్చేశారు. అది చూసిన తర్వాత అలా ఎలా చేశారు? అని అనిపించింది.
అంతేకాకుండా ఓ పొలిటికల్ డ్రామా లో నన్ను లక్ష్మి పార్వతి పాత్రలో నటించమని కోరారు. సరే చేస్తా అని చెప్పాను. అయితే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత లక్ష్మీపార్వతి గారు నాపై కేసు నమోదు చేశారు. కానీ నేను వాటికి ఏమాత్రం భయపడలేదు. ఆ కేసులన్నీ ఆ సినిమా డైరెక్టర్ చూసుకున్నారు ” అంటూ చెప్పుకొచ్చింది పూజిత. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.