SSMB 29: ఈ ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రాజమౌళి మహేష్ సినిమా వదులు కాబోతోంది ఇప్పటికి ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పనులు మొత్తం కంప్లీట్ కావడం జరిగాయి. ఈ విషయాన్ని రచయిత విజయేంద్రప్రసాద్ తెలియజేశారు. సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదని.. ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని పేర్కొన్నారు. అంతే కాదు కథ ఎక్కువగా అడవిలోనే సాగుతుందని.. పిరియాడికల్ డ్రామా కాదని అన్నారు. అదేవిధంగా సినిమా స్క్రిప్ట్ పూర్తయిందని.. సంగీత చర్చలు జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమా గురించి ఇటీవల మహేష్ జర్మనీ కూడా వెళ్లడం తెలిసిందే.
ఈ సినిమాకి సంబంధించి వర్కింగ్ “SSMB 29″పెట్టడం జరిగింది. పాన్ వరల్డ్ తరహాలో ఈ సినిమా ఉండబోతుందని సినీవర్గాలు తెలియజేస్తున్నాయి. మార్చి నెలలో అధికారిక ప్రకటన ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది జులైలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో న్యూస్ బాలీవుడ్ లో వైరల్ అవుతుంది. అదేమిటంటే రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్టులో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో రాజమౌళి దర్శకత్వంలో “బాహుబలి” సినిమాకి ఓ పాత్రకి సంబంధించిన అమితాబ్ నీ జక్కన్న సంప్రదించారు.
కానీ అప్పుడు అమితాబ్ ఒప్పుకోలేదు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక “బాహుబలి” పెద్ద హిట్ అయ్యాక నేను మంచి అవకాశం చేజార్చుకున్నాను అంటూ బిగ్ బి బాధపడ్డారు. అయితే ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమాకి మాత్రం అమితాబ్ ఓకే చెప్పినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. RRR, బాహుబలి సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద హిట్ అయ్యాయి. RRR అనేక అంతర్జాతీయ ఫిలిం అవార్డులతోపాటు ఆస్కార్ అవార్డు కూడ గెలవడం జరిగింది. దీంతో మహేష్ బాబు ప్రాజెక్ట్ ని రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఏకంగా 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.