ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నటి విద్యాసిన్హా(71) ముంబైలోని హస్పిటల్లో అనారోగ్యంతో కన్నుమూశారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ఈమె నటిగా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. 1947 నవంబర్ 15న ముంబైలో జన్మించిన ఈమె..18 ఏళ్ల వయసులోనే మోడల్గా ఎదిగారు. బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహించారు. అయితే పెళ్లి తర్వాతే సినీ రంగ ప్రవేశం చేశారు. కిరణ్ కుమార్ జతగా `రాజా కాక` చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చారు. `రజనీగంధ`, `పతి పత్నీ ఔర్ వో` సహా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన `బాడీగార్డ్` ఈమె నటించిన చివరి చిత్రం.
previous post