Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవి.. దగ్గుబాటి రానా కలిసి నటించిన సినిమా విరాటపర్వం. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఈ క్రమంలో “విరాటపర్వం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరుగుతున్న తరుణంలో విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. ఇద్దరూ ముఖ్య అతిథులుగా హాజరు అవుతున్నారు. యుద్ధం నేపథ్యంలో మధ్యలో పుట్టిన ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిన “విరాటపర్వం”లో.. సాయి పల్లవి , రానా మాత్రమే కాదు ప్రియమణి కూడా నటించడం జరిగింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే తాజాగా.. సినిమాలో వెన్నెల అనే పాత్ర సాయి పల్లవి చేయడం జరిగింది. అయితే ఈ క్యారెక్టర్ కి స్ఫూర్తి.. వరంగల్ కి చెందిన సరళ అనే మహిళ. ఈ సందర్భంలో తాజాగా డైరెక్టర్ వేణు, హీరో హీరోయిన్ సాయి పల్లవి, రానా సరళ మహిళ ఇంటికి వెళ్లడం జరిగింది. సరళ కుటుంబ సభ్యులను సినిమా యూనిట్ సభ్యులు కలసి వారి బాగోగులు ముచ్చటించారు. ఈ సందర్భంలో సరళ తల్లి సాయి పల్లవిని చూసి అచ్చం తన కూతురు.. చూసినట్టే ఉందని ఎమోషనల్ కావడంతోపాటు తెలంగాణ ఆచారం ప్రకారం.. చీర..సారె కూడా ఇవ్వటంతో సరళ కుటుంబసభ్యులు చూపిన ప్రేమకు సాయిపల్లవి ఏడ్చేసిందట.
ఇక వరంగల్ కి సాయి పల్లవి రావటంతో సరళ ఇంటి దగ్గర సందడి వాతావరణం నెలకొంది. సాయి పల్లవి ని చూడటానికి చాలా మంది రావడం జరిగింది. నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వరంగల్ లో ఇటీవల జరగడం తెలిసిందే. అయితే మరో గ్రాండ్ ఈవెంట్.. “విరాట పర్వం” సినిమా యూనిట్ ప్లాన్ చేయటం జరిగింది. ఈ వేడుకకు వెంకటేష్ తో పాటు చరణ్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు సమాచారం.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!