Manjummel boys: ప్రస్తుత కాలంలో మలయాళ సినిమాలకి ఎక్కువ ప్రేక్షక ఆదరణ దక్కుతుంది. మన తెలుగువారు అయినప్పటికీ మలయాళం సినిమాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ తరుణంలోనే అక్కడ రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సినిమాలను సైతం తెలుగులో రీమేక్ చేస్తున్నారు. వాటిని థియేటర్లో రిలీజ్ చేయకపోయినా ఓటీటీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
అలా ఇప్పటికే అనేక సినిమాలు రిలీజ్ అయి ఎనలేని ప్రేక్షక ఆదరణ పొందాయి. ఇక మలయాళం సినిమా పరిశ్రమలో ఇటీవలే రిలీజ్ అయ్యి ఎనలేని ఫాలోయింగ్ దక్కించుకున్న మూవీ ” మంజుమ్మెల్ బాయ్స్ “. ఈ మూవీ మలయాళం ఇండస్ట్రీలో సంచలన రికార్డ్ సృష్టించింది. అడ్వెంచర్, సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో షాహిర్, శ్రీనాథ్ బాసీ, బాలు వర్గీస్, దీపక్ తదితరులు ముఖ్య పాత్రలు వహించారు.
ఫిబ్రవరి 22వ తేదీన మలయాళం, తమిళ్ భాషలో రిలీజ్ అయిన ఈ మూవీ అనంతరం దక్షిణాది రాష్ట్రాల్లోని ఇతర ప్రధాన నగరాల్లో రిలీజ్ అయి మంచి మేర పాపులారిటీ దక్కించుకుంది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. వరుస కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. ఈ మూవీ ఇండియాలో సుమారు రూ.109 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తుంది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే రూ. 60 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా మొత్తం గా 175 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఓ గొప్ప రికార్డును సృష్టించింది.
మలయాళం లో ముమ్మట్టి, మోహన్ లాల్, పృధ్విరాజ్ సుకుమారన్ లాంటి హీరోల సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది కూడా. అతి తక్కువ సమయంలోనే 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. దీంతో ప్రతి ఒక్కరి దృష్టి ఈ సినిమాపై మల్లింది. ఎప్పుడొచ్చామనేది కాదు.. సరైన హిట్ పడిందా లేదా అనేది చూసుకోవాలి అనే కాన్సెప్ట్ మరోసారి నిరూపించారని చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమా రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులు రివార్డులు సాధిస్తుందో చూడాలి. ఏదేమైనప్పటికీ ఒక సాధారణ చిన్న సినిమాగా విడుదలై ఇంతటి విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదని చెప్పుకోవచ్చు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!