SVP: మహేష్ బాబు “సర్కారు వారి పాట” ట్రైలర్ ప్రస్తుతము సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. కళావతి, పెన్నీ పాటల మాదిరిగానే “సర్కారు వారి పాట” థియేట్రికల్ ట్రైలర్ రికార్డుల మీద రికార్డ్ లు క్రియేట్ చేస్తూ ఉంది. మహేష్ బాబుని చాలా అందంగా.. వైలెంట్ గా.. తనదైన శైలిలో డైరెక్టర్ పరుశురాం చూపించాడు. ముఖ్యంగా శ్రీకాకుళం యాస భాషలో మహేష్ పలికిన డైలాగులు చాలా కొత్తగా అనిపించాయి. ట్రైలర్ చూసి చాలా వరకు బయటకు కచ్చితంగా ఇది “పోకిరి”, “దూకుడు” తరహాలో… ఫీల్.. కలిగించే సినిమా అని కామెంట్లు చేస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే ఈ సినిమా మే 12వ తారీకు విడుదల కానున్న తరుణంలో.. ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా డైరెక్టర్.. పరశురాం అదేవిధంగా హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో డైరెక్టర్ పరుశురాం “సర్కారు వారి పాట” ట్రైలర్ కి సంబంధించి ఒక కొత్త విషయాన్ని బయట పెట్టడం జరిగింది. అదేమిటంటే ట్రైలర్ లో ఒక చోట మహేష్ బాబు… విలన్ లా గుంపు ముందు.. 100 వయాగ్రా టాబ్లెట్ లు వేసుకొని శోభనం గదికి వచ్చినట్లు వచ్చారు అని వైలెంట్ వాయిస్ తో పలుకుతాడు. అయితే ఈ డైలాగ్ ముందు చెప్పడానికి మహేష్ బాబు ఒప్పుకోలేదట. మిస్ ఫైర్ అవుతుందని.. బయట నెగిటివ్ టాక్ వచ్చే అవకాశం ఉందని డిస్కషన్ పెట్టారట.చివరాకరికి బతిమిలాడి ఎలాగైతే ఆయనతో ఆ డైలాగ్ చేపించడం జరిగింది. బయట ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తోంది అని డైరెక్టర్ పరుశురాం అన్నారు. ఇంకా సినిమాకి సంబంధించి అనేక విషయాలు ఇంటర్వ్యూల్లో తెలియజేశారు. ఇదిలా ఉంటే “సర్కారు వారి పాట” ట్రైలర్ టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే ఎక్కువ మంది చూసిన… లైకులు కొట్టిన ట్రైలర్ గా రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. మే 12వ తారీకు సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.