Puri Jagannath: అప్పట్లో 2012వ సంవత్సరంలో డిసెంబర్ మాసం యుగాంతం అని చాలామంది చెప్పుకొచ్చారు. అంత మాత్రమే కాక సినిమా కూడా వచ్చింది. ఆ దారుణమైన సంఘటన జరుగుతుంది అని చెప్పి 8 సంవత్సరాలయింది, కరోనా తప్ప అంతగా ప్రపంచాని పెద్దగా ఏది కదిలించలేదు. ఇలాంటి తరుణంలో టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. 2030 సంవత్సరం లో ఓ వింతైన సంఘటన జరుగుతుందని జోస్యం చెప్పాడు. మేటర్ లోకి వెళ్తే భూమ్మీద అందమైన నగరాలుగా పేరుతెచ్చుకున్న వాటిలో ఇటలీ దేశంలో ఉండే వెనిస్ కూడా ఒకటి.
ఇటలీ దేశానికి ఉత్తరాన ఉండే ఈ నగరానికి ప్రపంచవ్యాప్తంగా ఉండే పర్యాటక ప్రేమికులు ప్రతి సంవత్సరం గుంపులు గుంపులుగా వస్తారు. వందకుపైగా ఐలాండ్స్ కలిగిన ఈ సిటీ లో చిన్న చిన్న కాలువలు అందమైన సీనరీ లు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక సినిమాలకు సంబంధించిన షూటింగులు కూడా జరుగుతుంటాయి.
పర్యాటక రంగంలో ఎంతో అభివృద్ధి చెందిన ఈ సిటీ లో ఉండే స్థానికులు.. టూరిజమ్ ఆధారం చేసుకుని సొంత ఇంటిని హోటల్ గా లేకపోతే లాడ్జిగా మార్చేస్తూ ఆ విధంగా బతుకు సాగిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ నగరం నీట మునగడానికి రెడీగా ఉందని మరో 9 సంవత్సరాలలో మొత్తం ద్వీపాలు వీటిలో మునిగిపోతాయని ఈ సిటీ మొత్తం 2030 కి దెయ్యాల దిబ్బ గా మారుతుందని తాజాగా పూరి తన ఆడియో రూపంలో ఇచ్చే పూరి మ్యూజింగ్స్ లో చెప్పుకొచ్చాడు.