కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద చిత్రీకరించిన `ఒక్కడు` సినిమా సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు `సరిలేరు నీకెవ్వరు` సినిమా కోసం రామోజీ ఫిలిమ్ సిటీలో కొండారెడ్డి బురుజు భారీ సెట్ను వేసి షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో షెడ్యూల్ జరుగుతోంది.
సూపర్స్టార్ మహేష్ హీరోగా దిల్రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు`. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ రామోజీ ఫిలిమ్ సిటీలో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. 2020 సంక్రాంతి కానుకగా వరల్డ్వైడ్గా చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా …
నిర్మాత అనీల్ సుంకర మాట్లాడుతూ – “16 ఏళ్ల క్రితం వెండితెరపై కొండారెడ్డి బురుజు లొకేషన్ ఐకాన్గా మారింది. మళ్లీ ఇప్పుడు ఆ లొకేషన్కు వచ్చాం. అయితే ఈసారి మరింత పెద్దదిగా లొకేషన్ను ఆవిష్కరించనున్నాం. మా ప్రొడక్షన్ డిజైనర్ ఎ.ఎస్.ప్రకాశ్.. కొండారెడ్డి బురుజు లొకేషన్ను అద్భుతమైన రీతిలో తీర్చిదిద్ది రామోజీ ఫిలిమ్ సిటీలో ఆవిష్కరించారు“ అన్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్రాజు మాట్లాడుతూ – “మహేశ్, కొండారెడ్డి బురుజు అనే ఎపిక్ కాంబినేషన్ ఈ సంక్రాంతికి మీ ముందుకు రానుంది“ అన్నారు.
previous post