Chiranjeevi: దర్శకుడు బాబీ దర్శకత్వంలో చిరంజీవి 154వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా శృతి హాసన్ నీ తీసుకోవడం జరిగింది. అదే రీతిలో ఒక కీలకమైన పాత్ర కోసం మాస్ మహారాజా రవితేజ నీ కూడా తీసుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో రెండవ హీరోయిన్ విషయంలో నివేదా పేతురాజ్ నీ సినిమా యూనిట్ కన్ఫర్మ్ చేసినట్లు రవితేజ జోడిగా ఈమె నటించనున్నట్లు సమాచారం.
నివేదా పేతురాజ్ తెలుగులో మెంటల్ మదిలో సినిమాతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. “చిత్రలహరి” అదేవిధంగా “బ్రోచేవారెవరు” మంచి పేరు సక్సెస్ సాధించడం జరిగింది. రెడ్ మరియు పాగల్ సినిమాలు వివిధ పేతురాజ్ కి స్పెషల్ గుర్తింపు తెచ్చాయి. “విరాట పర్వం” లో కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇటువంటి తరుణంలో చిరంజీవి 154 సినిమాలో నివేదా పేతురాజ్ అవకాశం అందుకున్నట్లు వార్తలు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ అ కాంబినేషన్ లో సినిమాలో అదిరిపోయే సన్నివేశాలు డైరెక్టర్ బాబీ స్క్రిప్టులో రూపొందించినట్లు గ్యారెంటీగా మాస్ ఆడియన్స్ ని అలరించే రీతిలో సినిమా ఉండానున్నట్లు సమాచారం. అంతే కాకుండా కేవలం ఐదు నెలలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానున్నట్లు కూడా సరికొత్త టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది. కరోనా కారణంగా గతంలో షూటింగ్ లు… ఆలస్యం అవుతూ ఉండటం తో.. ఈసారి మొదలుపెట్టిన సినిమాలు తొరగా కంప్లీట్ చేయాలని చిరంజీవి డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏప్రిల్ నెలలో “ఆచార్య” విడుదల కానున్న నేపథ్యంలో… సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని చరణ్, చిరు డిసైడ్ అయినట్టు సమాచారం.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!