(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: అమరావతిలో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మహిళలపై పోలీసులు ప్రతాపం చూపించడం దారణమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మందడం గ్రామంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మహిళలను బలవంతంగా పోలీసులు వ్యాన్ ఏక్కించడంపై లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మహిళల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుకు సంబందించిన వీడియోను పోస్టు చేస్తూ ఇచ్చిన మాటపై నిలబడండి, మడమ తిప్పకండి అని అక్కా చెల్లిళ్ళు అడగటం తప్పా అని ప్రశ్నించారు. లాఠీలతో ఉద్యమాలను అణచివేయాలి అనుకున్న నియంతలు ఎక్కడ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని లోకేష్ వ్యాఖ్యానించారు. అమరావతిలో పోలీసులు మహిళల గొంతు నొక్కి, ఈడ్చుకెళ్లే ఘటన జగన్ నియంతృత్వ పాలనకు నిదర్శనమని లోకేష్ విమర్శించారు.
శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మహిళలపై మీ ప్రతాపం చూపించడం దారుణం @ysjagan గారు. ఇచ్చిన మాట పై నిలబడండి, మడమ తిప్పకండి అని అక్కాచెల్లెళ్ళు అడగటం తప్పా? (1/2) pic.twitter.com/IJ5LTNbewQ
— Lokesh Nara (@naralokesh) January 3, 2020