Narappa : కరోనా ఫస్ట్ వేవ్ తో పాటు సెకండ్ వేవ్ తోనూ సినిమా ఇండస్ట్రీకి గట్టి దెబ్బ పడిన సంగతి తెలిసందే. ఈ రెండేళ్ళలో ఎన్ని వేల కోట్ల నష్టం వాటిళ్ళిందో ఊహకందడం లేదని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారు. అయితే ఇలాంటి విపత్తు రావడం వల్లే గత ఏడాది నుంచి ఓటీటీలకి బాగా డిమాండ్ పెరిగింది. అందుకే చిన్న సినిమాలతో పాటు భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఉన్న ప్రముఖ ఓటీటీలలో ఎవరు భారీగా ఆఫర్ ఇస్తే వారికి స్ట్రీమింగ్ రైట్స్ ఇచ్చేస్తున్నారు. అలా తాజాగా ఓటీటీలో రిలీజైన సినిమా నారప్ప.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన నారప్ప సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైం వీడియోస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. చాలా కాలం తర్వాత ప్రియమణి రీ ఎంట్రీ ఇచ్చింది. రీమేక్ సినిమాలకి వెంకీ ఓ బ్రాండ్ గా ఉంటాడు. అలా ఇప్పుడు నారప్ప సినిమాతో వచ్చారు. తమిళంలో రెండేళ్ళ క్రితం వచ్చిన అసురన్ సినిమాకి తెలుగులో అఫీషియల్ రీమేక్ గా నారప్ప రూపొందింది. అయితే ధనుష్ నటించిన ఈ సినిమా అప్పట్లో థియేటర్స్ రిలీజై 100 కోట్లకి పైగానే వసూళ్ళు రాబట్టింది. దాంతో ఈ సినిమా తెలుగు రిమేక్ వెంకటేశ్ తో చేస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచే అంచనాలు, కంపేరిజన్స్ మొదలయ్యాయి.
Narappa : పెద్ద మైనస్ ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ కాకపోవడమే.
అయితే తెలుగులో పెద్ద మైనస్ అంటే ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ కాకపోవడమే. మరి ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా నిర్మాతలకి లాభాలు తీసుకు వచ్చిందా లేదా అనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం, ఓటీటీతో పాటు శాటిలైట్ రైట్స్ అలాగే ఇతర స్ట్రీమ్ ల ద్వారా వచ్చే ఆదాయాన్ని అటుంచితే.. అమెజాన్ ఒక్కటే నిర్మాతలకు రూ.40 కోట్ల ఫ్యాన్సీ ఆఫర్ కి సినిమాను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. దీనితోనే నిర్మాతలకు రూ.17 కోట్ల వరకు లాభం వచ్చిందని సమాచారం. ఈ సినిమా లాభాల పరంగా నిర్మాతలైన సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను చాలా హ్యాపీగా ఉన్నట్టు సమాచారం.