Breaking: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ రోజు ఏడు రాష్ట్రాల్లో సోదాలు జరుపుతోంది. ప్రిజన్ రాడికలైజేషన్ కేసు లో తనిఖీలు చేపట్టింది. లష్కరే తోయిబా ఉగ్రవాదులు జైలు ఖైదీలను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 2013లో బెంగళూరు జైలు నుండి ఉగ్రవాదుల పరారీ కేసు, రామేశ్వరం కేఫ్ ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమైయ్యారు. ఆ కేసులో లింకున్న ప్రదేశాల్లో ఈరోజు ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తొంది.
ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తో పాటు మరో 17 ప్రదేశాల్లో ఇవేళ ఉదయం నుండి తనిఖీలు జరుగుతున్నాయి. అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. బెంగళూరులో సిటీ పోలీసులు ఈ కోణంలో తొలి సారి కేసు నమోదు చేశారు. గత ఏడాది ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్న తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడు రైఫిల్స్, నాలుగు హ్యాండ్ గ్రానేడ్లు, 45 లైవ్ రౌండ్లు, నాలుగు వాకీటాకీలు సీజ్ చేశారు. ఆ కేసులో అయిదుగురిని తొలుత అరెస్టు చేశారు. వాళ్లను విచారించిన తర్వాత మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అరెస్టు అయిన వారి సంఖ్య ఆరుకు చేరింది.
ఈ కేసులో లష్కరే తొయిబా ఉగ్రవాది టీ నజీర్ ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. బెంగళూరు సెంట్రల్ జైలు లో ఉన్న అయిదుగురిని అతను రాడికలైజ్ చేసినట్లు తెలుస్తొంది. ఈ కేసులో జునైద్ అహ్మద్ అనే వ్యక్తి కూడా నిందితుడిగా ఉండగా, ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. నజీర్ ఖైదీగా 2013 నుండి బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్నాడు. 2017 లో కొంత మంది ఖైదీలు చేరడంతో వాళ్లను అతను రాడికలైజ్ చేసినట్లు గుర్తించారు. గత అక్టోబర్ నెలలో ఈ కేసును ఎన్ఐఏ తీసుకున్నది. ఆ తర్వాత తనిఖీలు నిర్వహించింది. రీసెంట్ గా రామేశ్వరం కేఫ్ లో జరిగిన ఘటనతో పాటు బెంగళూరులో పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ఎన్ఐఏ అప్రమత్తమైంది.
Babu Mohan: పొలిటికల్ కమెడియన్ పార్టీలో చేరిన రాజకీయ నేతగా మారిన సినీ కమెడియన్