దాదాపు రెండు సంవత్సరాలపాటు రాజకీయరంగంలో ఉండే పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం అవ్వటం తో మెగా అభిమానులు చాలా మిస్ అయ్యారు. కేవలం రాజకీయాలకే తన జీవితం అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడంతో అప్పట్లో బాగా మెగా అభిమానులు బాధ పడ్డారు. అయితే తర్వాత చాలామంది రాజకీయ నేతలు ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరోపక్క వ్యాపారాలు చేయటంతో పవన్ పై సినిమాలు చేయాలని ఒత్తిడి రావడంతో ఆయన నిర్ణయం మార్చుకోవటం మనకందరికీ తెలిసిందే.
ఇదిలా ఉండగా 2019 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ మరోపక్క రాజకీయ రంగంలో కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ నిర్మాతగా కొత్త సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. మేటర్ ఏమిటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో సినిమాని నిర్మించే ఆలోచనలో పవన్ ఉన్నట్లు సమాచారం.
అయితే ఈ ప్రాజెక్టు చర్చల దశలో మాత్రమే ఉన్నట్లు, త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. మరోపక్క రామ్ చరణ్ సొంత బ్యానర్లో చిరంజీవితో వరుస సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల ఓ స్టోరీ పవన్ కళ్యాణ్ కి వినిపించగా బాగా నచ్చడంతో ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.