Radhe Shyam :పూజా హెగ్డే, ప్రభాస్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ రాధేశ్యామ్ మార్చి 11న గ్రాండ్గా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా స్టోరీపై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్హాట్గా చర్చ జరుగుతోంది. గతంలో వచ్చిన రిపోర్ట్స్ చీరో అనే ఒక ఐరిష్ ఆస్ట్రాలజర్ జీవితాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాధేశ్యామ్ మూవీ తెరకెక్కించారని పేర్కొన్నాయి. మరికొన్ని రిపోర్ట్స్ విలియం జాన్ వార్నర్ అనే ఒక వ్యక్తి జీవితంలో చోటుచేసుకున్న రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ప్రకారం దీన్ని రూపొందించినట్లు తెలుపుతున్నాయి. విలియం అనే ఒక వ్యక్తి 1970లో యూరప్ దేశాల్లో ఒక టన్నెల్ గుండా వెళ్లే ట్రైన్ మిస్ అవుతాడని ఆ తర్వాత జరిగిందే రాధేశ్యామ్ స్టోరీ అని కొన్ని రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి.
Radhe Shyam: పునర్జన్మల చుట్టూ తిరిగే స్టోరీ?
సోషల్ మీడియాలో రాధేశ్యామ్ మూవీ స్టోరీ పునర్జన్మల చుట్టూ తిరుగుతుందని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే పునర్జన్మల కాన్సెప్టు రాధేశ్యామ్ లో అస్సలు ఉండదని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం మూడు జన్మలు ఉంటాయని, ఫస్ట్ రెండు జన్మల్లో హీరోహీరోయిన్లు చనిపోతారని నెటిజనులు ఒక కొత్త స్టోరీ తెరపైకి తీసుకొచ్చారు. అయితే రాధా కృష్ణ కుమార్ మాత్రం 1 ప్రేమని హ్యాండిల్ చేయడమే కష్టం. మరి 2 ఎందుకు బ్రదర్ అంటూ ఈ స్టోరీ కూడా కాదన్నట్లు చెప్పుకొచ్చారు.
ఇంతకీ స్టోరీ ఏంటి
కోట్లాది మంది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ స్టోరీ ఏంటనేది ఇప్పటి వరకు ఎవరికీ క్లారిటీ లేదు. ఇంకో నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్ అయ్యాక స్టోరీలైన్ ఏంటనేది తెలిసే అవకాశం ఉంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ ప్రియదర్శి కృష్ణంరాజు సచిన్ మురళీశర్మ వంటి స్టార్ యాక్టర్స్ ముఖ్య పాత్రల్లో నటించారు.