అమరావతి: మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర బ్రాహ్మణ ప్రంట్ (ఆర్బిఎఫ్) నేతలు కొత్త డిమాండ్ను తెరపైకి తీసుకువచ్చారు. ఎస్సి అట్రాసిటీ చట్టం మాదిరిగానే రాష్ట్రంలో బ్రాహ్మణులు పడుతున్న ఇబ్బందుల రీత్యా బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం తేవాలని ఆ సంఘ నేతలు కోరుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఆర్బిఎఫ్ జాతీయ నేతలు సత్య సాయినాధ్ శర్మ, మహిళా అధ్యక్షురాలు సాదినేని యామిని శర్మ వినతి పత్రాన్ని సమర్పించారు.
పేరుకు అగ్రవర్ణంగా ఉన్నా రాష్ట్రంలో అనేక పేద బ్రాహ్మణ కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా వారు గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ప్రభుత్వంతో చర్చించాలనీ, అవసరమైతే ఆర్డినెన్స్ విడుదల చేయాలనీ వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బ్రాహ్మణులు పడుతున్న ఇబ్బందులు ఇప్పుడే తన దృష్టికి వచ్చినందున వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని గవర్నర్ వారికి హామీ ఇచ్చారు.