వైకాపా రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మరో లేఖ రాసారు. జగన్ అధికారంలోకి వచ్చాక అవ్వాతాతల పథకానికి ఆమోదం తెలిపారు. దీని ప్రకారంగా వయో పరిమితి 65 ఏళ్ల నుండి 60 ఏళ్ల వరకూ తగ్గించారు.
అయితే 2019 జులై నుండి అమల్లోకి వస్తుందని తెలిపినా కానీ ఈ ఏడాది ఫిబ్రవరి నుండి అమల్లోకి వస్తోందని, దీని వల్ల 7 నెలల కాలానికి రూ.15,750 లబ్ధిదారులు నష్టపోయారని రఘురామ కృష్ణంరాజు లేఖలో వివరించారు. నష్టపోయిన మొత్తం లబ్దిదారులకు అందేలా చూడాలని ఆయన తెలిపారు. అంతే కాకుండా ప్రతీ ఏడాదీ పెంచుతోన్న రూ.250 పెన్షన్ కానుకను వైఎస్ జయంతి రోజు నుండి అమలయ్యేలా చూడాలని అన్నారు.