ఆంధ్రప్రదేశ్ లో కొద్దిసేపటి క్రితం ఉన్నతమైన పదవులను కీలక వ్యక్తులు అలంకరించారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమేష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రభుత్వం సూచించిన జాగ్రత్తల మధ్య జరిగింది.
మరోవైపు ఇన్ఫర్మేషన్ కమీషనర్ గా రేపాల శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేసారు. సచివాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ సీఎస్ నీలం సాహ్ని గారు ఈ ప్రమాణ స్వీకారాలు చేయించారు. ఈ మేరకు మీడియాకు సమాచారం అందింది. రేపాల శ్రీనివాసరావు గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వ్యక్తి. రమేష్ కుమార్ 2017లో ఐఏఎస్ గా రిటైర్ అయ్యారు. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సభ్యునిగా బాధ్యతలు స్వీకరించారు.