RS Praveen Kumar: తెలంగాణలో బీఎస్పీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీని వీడారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం వచ్చిందని, పార్టీని వీడిటం తప్ప మరో అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని బీఎస్పీ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
బీఎస్పీ అధినేత్రి మాయావతి జాతీయ స్థాయిలో ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని ప్రకటన చేసినప్పటికీ తెలంగాణలో మాత్రం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ..ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో పొత్తు చర్చలు జరిపారు. ఉమ్మడిగా ప్రకటన కూడా చేశారు. తాజాగా నిన్న సీట్ల సర్దుబాటు కూడా జరిగింది. రెండు లోక్ సభ స్థానాలు పొత్తులో భాగంగా బీఎస్పీకి ఇస్తున్నట్లు కేసిఆర్ ప్రకటించారు. ఈ తరుణంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీని వీడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
పొత్తు (బీఆర్ఎస్ – బీఎస్పీ) ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందేనని, ఇదే తాను నమ్మిన నిజమైన ధర్మం అని పేర్కొన్నారు. తమ పార్టీల పొత్తు వార్త బయటకు వచ్చిన వెంటనే బీజేపీ దాన్ని భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తొందని ఆరోపించారు. ఈ కుట్రలకు భయపడి తాను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేనని అన్నారు. నా ప్రస్థానాన్ని ఆపలేను అని పేర్కొన్నారు. చివరి వరకూ బహుజనవాదాన్ని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటా అని ప్రవీణ్ కుమార్ తన పోస్టులో రాసుకొచ్చారు. తెలంగాణలో భవిష్యత్తు కార్యచరణపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇక బీఎస్పీదేనని ఆయన పేర్కొన్నారు.
కాగా, బీఎస్పీకి రాజీనామా చేసిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ .. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో సమావేశమైయ్యారు. తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం