బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్కు చెందిన కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) సంస్థ అమెరికా క్రికెట్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టింది. ఆ దేశంలో త్వరలో ఆరంభం కాబోయే మిలియన్ డాలర్ల మేజర్ లీగ్ టీ20 లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా క్రికెట్ ఎంటర్ప్రైజెస్ (ఏఎస్ఈ) సంస్థతో షారుక్ చేతులు కలిపాడు. దీనితో కలకత్తా నైట్ రైడర్స్ సంస్థ కీలక వాటాదారుగా మారింది.
ఈ విషయం మీద షారుఖ్ మాట్లాడుతూ, “కొన్నేళ్లుగా నైట్ రైడర్స్ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేసెందుకు ప్రయత్నిస్తున్నాం. అమెరికా లో జరగబోయే మేజర్ లీగ్ క్రికెట్ పట్ల మేము సంతృప్తిగా ఉన్నాము. ఆసియ దేశాల తర్వాత క్రికెట్ ను ఎక్కువగా అభిమానించే వారి సంఖ్యా అమెరికా లోనే ఎక్కువగా ఉంది. ఆగ్రదేశంలో క్రికెట్ అభివృద్ధి కోసం అమెరికన్ క్రికెట్ ఎంటర్ప్రైజెస్ (ఏసీఈ)లో పెట్టుబడులు పెట్టామని, దీనిలో భాగస్వామ్యం పొందడం చాల సంతోషంగా ఉంది అని అయినా తెలిపారు. షారుక్తో పాటు కేకేఆర్ యజమానుల్లో ఒకరైన జూహీచావ్లా కూడా ఏసిఈ సంస్థతో కలిపి పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకొంది.
ఇక, ప్రస్తుతం ఐపీఎల్లో కేకేఆర్తో పాటు కరీబియన్ ప్రీమియర్ లీగ్లో ట్రిన్బాగో నైట్రైడర్స్ జట్లకు షారుఖ్ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. అమెరికాలో ప్రారంభమయ్యే లీగ్లో లాస్ఏంజెల్స్ ఫ్రాంచైజీని షారుక్ దక్కించుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అమెరికా క్రికెట్లో కొనుగోలు చేసిన టీమ్ లాస్ఎంజెల్స్కు ప్రాతినిథ్యం ఇస్తుందని, లాస్ఎంజెల్స్ నైట్రైడర్స్గా బరిలోకి దిగుతుందని కేకేఆర్ వర్గాలు తెలిపాయి.ఇప్పటికే కరీబీయన్ ప్రీమియర్ లీగ్ లో ట్రిన్బాగో నైట్రైడర్స్ ఫ్రాంచైజీ ఉంది. ఈ ఏడాది ట్రోఫీని గెలిచింది. ఐపీఎల్ 2020 సీజన్లో మాత్రం కేకేఆర్ ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిబాట పట్టింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజయవంతం అయ్యాక అనేక దేశాల్లో టీ20 లీగులు ప్రారంభించారు. కరీబియన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ టీ 20 లీగులూ క్రికెట్ లవర్స్ ని బాగా అలరించాయి. ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్బాష్ సూపర్హిట్ అయింది. తాజాగా శ్రీలంకలో టీ20 లీగ్ మొదలవుతోంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ ఇదే బాటలో పయనిస్తున్నాయి. అమెరికాలో దక్షిణాసియా వాసులు ఎక్కువగా ఉంటారు. అక్కడి భారతీయులు, పాకిస్థానీలు, బంగ్లావాసులు, లంకేయులు క్రికెట్ను ఆదరిస్తున్నారు. అందుకే అగ్రరాజ్యంపై నైట్రైడర్స్ కన్నేసింది.