కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు మృతి చెందారు.
కసర్గోడ్ జిల్లా రాజపురంలోని పనాథూర్ ప్రాంతానికి సమీపంలో కర్నాటకు చెందిన ఓ పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పిి ఇంట్లోకి దూసుకుపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న అయిదుగురు మంది మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణీకులు ఉన్నారు.
ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 44 మంది గాయపడగా 33 మంది కన్హాంగడ్ జిల్లా ఆసుపత్రికి, 11 మందిని పుతంకల్ తాలూకా ఆసుపత్రికి తరలించారు. అయిదుగురు పుతంకల్ తాలూకా ఆసుపత్రిలో ఒకరు కన్హాంగడ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు: ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.