దేశవ్యాప్తంగా గొప్ప నటిగా మంచి పేరు తెచ్చుకున్న సుమలత ఆ తరువాత రాజకీయాలలో కూడా రాణించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఎంపీ సుమలతకు రెండు రోజుల క్రితం తనకి తలనొప్పి మరియు గొంతు నొప్పి రాగా ఆమెకు కరోనా పరీక్షలు చేశారు.
ఇక కొద్ది సేపటి క్రితం వచ్చిన ఫలితం లో ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే ఇటీవలే తన నియోజకవర్గ ప్రజలకు కరోనా పై అవగాహన కల్పించేందుకు సుమలత వెళ్లడం గమనార్హం.
ప్రస్తుతానికి ఆమె పరిస్థితి గురించి ఆందోళన పడవలసిన అవసరం ఏమీ లేదని డాక్టర్లు చెప్పగా తాను త్వరలోనే తిరిగి కోలుకుంటానని… తన అభిమానులు మరియు మద్దతుదారుల ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని సుమలత చెప్పారు. హోమ్ క్వారాంటైన్ లోనే ఇప్పుడు ఆమె చికిత్స తీసుకుంటున్నారు.