తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న విజయనగరం జిల్లాలో ఆ పార్టీ జనసేన, బీజేపితో పొత్తు పెట్టుకున్న కూడా కోలుకోలేకపోతోంది. అసలే ఇబ్బందుల్లో ఉన్న ఆ పార్టీకి పొత్తులు ఎత్తులతో మరింతగా ఇబ్బంది వచ్చి పడుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు.. విజయనగరం పార్లమెంటు స్థానం కూడా ఉంది. ఇక మూడు అసెంబ్లీ స్థానాలు అరకు పార్లమెంటు పరిధిలోకి వెళతాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న తొమ్మిది సీట్ల విషయానికి వస్తే నెల్లిమర్ల అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించడంతో ఆ సీటులో గెలుపు ఆశల మీద సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అక్కడ ఇప్పటివరకు ఇన్చార్జిగా ఉన్న కర్రోతు బంగారు రాజు జనసేనకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఇక గజపతినగరం సిటీలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుకు కాకుండా ఆయన సోదరుడు శ్రీనివాస్ కు సీటు ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ కేడర్లలో అసమ్మతి రాజుకుంది. గజపతినగరంలో తెలుగుదేశం రెండు వర్గాలుగా చేరిపోయింది. ఇక ఎస్కోటలో మాజీ ఎమ్మెల్యే, అక్కడ మంచిపట్టున్న లలిత కుమార్ కి కాకుండా.. ఎన్నారై గొంప కృష్ణకు సీటు ఇస్తారన్న ప్రచారంతో అక్కడ కూడా పార్టీ రెండు వర్గాలుగా చేరిపోయింది.
పైగా ఎన్నారైకి టికెట్ ఇవ్వకపోతే ఆర్థికంగా అక్కడ ఇబ్బందులు వస్తాయని అధిష్టానం ఆలోచన. ఇక విజయనగరం సిటీలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తమ కుమార్తె అదితిని పోటీకి పెట్టారు. కానీ తూర్పు కాపులు బలంగా ఉన్నాయి. ఇక్కడ నేపథ్యంలో తమ సీటును ఓసీకి ఎలా ? ఇస్తారు అని వారు గుర్రుగా ఉన్నారు. పైగా విజయనగరం సీటు మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఆశిస్తున్నారు. ఆమె గత ఎన్నికల్లోనే అతిథికి సపోర్ట్ చేయకపోవడంతో ఆమె ఓడిపోయింది. ఇక బొబ్బిలిలో టీడీపి గెలిచి 30 సంవత్సరాలు అవుతోంది. ఈసారి బొబ్బిలి రాజులు టీడీపీలో ఉండడంతో గెలుస్తామని చెబుతున్నా.. నమ్మకాలు లేవు.
ఇక ఏజెన్సీ లో ఉన్న సాలూరు, కురుపురం, పార్వతీపురం మూడో కూడా వైసీపీలో ఖాతాలో పడతాయని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ మూడు చోట్ల కూడా వైసిపి డమ్మీ అభ్యర్థులను.. టీడీపీ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని.. టీడీపీ వాళ్ళే చెప్తున్నారు. ఇక చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ గెలుపు మరోసారి నల్లేరు మీద నడకే అంటున్నారు. ఏది ఏమైనా ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఉత్తరంధ్ర లోని విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇంత ఘోరంగా ఉండటం పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తోందని చెప్పాలి.