NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ క‌మ్మ‌లు వ‌ర్సెస్ వైసీపీ బీసీలు… ఎవ‌రి స్ట్రాట‌జీ ఏంటి…!

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌లను అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకు న్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అభ్య‌ర్థుల‌ను పోటాపోటీగా నిల‌బెడుతున్నారు. ముఖ్యంగా వైసీపీని తీసుకుంటే.. కీల‌క‌మైన ప్ర‌యోగానికి తెర‌దీసింది. బీసీల‌కు పెద్ద పీట వేస్తున్నామ‌ని చెబుతూ.. చాలా వ‌ర కు నియోజ‌క‌వ‌ర్గాల్లో బీసీల‌ను స‌మ‌న్వ‌య క‌ర్తలుగా వైసీపీ అవ‌కాశం ఇచ్చింది. వీరు.. ఖ‌చ్చితంగా గెలుపు గుర్రం ఎక్కుతార‌ని కూడా భావిస్తున్నారు.

వైసీపీ చేసిన ప్ర‌యోగాల‌ను గ‌మ‌నిస్తే.. ఓసీ స్థానాల‌ను కూడా బీసీల‌కు కేటాయించింది. ఉదాహ‌ర‌ణ‌కు మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గాన్ని గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ రెడ్డి నాయ‌కుడు ఆళ్ల గెలుస్తున్నారు. ఈ ద‌ఫా ఇక్క‌డ బీసీ మంత్రం ప‌ఠించింది వైసీపీ. దీంతో అవ‌స‌ర‌మైతే.. కొన్ని త్యాగాల‌కు కూడా సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ అనుస‌రించే వ్యూహంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఎలాంటి వ్యూహంతో ఈ పార్టీ ముందుకు సాగుతుంది? అని అందరూ అనుకున్నారు.

అయితే.. బీసీల‌ను వైసీపీ నిల‌బెట్టిన నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ పోటా పోటీగా ఎందుకో.. బీసీల‌కు అవ‌కాశం ఇవ్వ‌లేక పోయింది. దీనికి కార‌ణాలు ఎలా ఉన్నా.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓసీ వ‌ర్సెస్ బీసీల‌కు మ‌ధ్య పోటీ జ‌ర‌గ‌నుంది. మ‌రి ఇది ఏ పార్టీకి మేలు చేస్తుంది ? అనేది ఎన్నిక‌ల వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. ప్ర‌జ‌లు ఇచ్చే తీర్పు ఎలా ? ఉంటుంద‌నేది చూడా అంచ‌నా వేయాలి.

ఉదాహ‌ర‌ణ‌కు .. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం తీసుకుంటే.. ఇక్క‌డ ఉన్న ఓసీ అభ్య‌ర్థిని ప‌క్క‌కు త‌ప్పించి మ‌రీ.. వైసీపీ అధినేత జ‌గ‌న్.. బీసీ కేండెట్‌కు టికెట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. దీంతో భ‌గ్గున సెగ‌లు వ‌చ్చినా.. చ‌ల్లార్చుకుని.. మ‌రీ పోరుకు రెడీ అయ్యారు. టికెట్ ఎవ‌రికి ఇచ్చినా.. బీసీ ఖాయం. ఇక‌, టీడీపీని చూస్తే.. ఓసీ అభ్య‌ర్థి నారా లోకేష్‌కే మ‌రోసారి టికెట్ ఇచ్చారు. సామాజిక వ‌ర్గాల ఈక్వేష‌న్ ప్ర‌కారం జ‌నం ఓట్లేస్తే.. ఇక్క‌డ పోలింగ్ ఉత్కంఠ‌గానే మార‌నుంది.

మ‌రో నియోజ‌క‌వ‌ర్గం క‌ళ్యాణదుర్గం. ఇక్క‌డ కూడా.. వైసీపీ ప్ర‌యోగానికి రెడీ అయింది. ఇక్క‌డ ఆల్రెడీ బీసీ నాయ‌కురాలు.. కురబ సామాజిక వ‌ర్గానికి చెందిన ఉష‌శ్రీచ‌ర‌ణ్ ఉన్నారు. అయితే.. ఆమెను త‌ప్పించినా.. మ‌రోసారి బీసీకే వైసీపీ ప్రాధాన్యం ఇచ్చింది. ఎంపీ త‌లారి రంగ‌య్య‌కు ఈ టికెట్ కేటాయించే అవ‌కాశం ఉంది. ఈయ‌నను ప్ర‌స్తుతం ఇంచార్జిగా నియ‌మించారు. ఇక‌, టీడీపీ నుంచి చూస్తే.. క‌మ్మ వ‌ర్గానికి చెందిన అమిలినేని సురేంద్ర‌బాబుకు ఇచ్చారు. అంటే.. ఇక్క‌డ కూడా ఓసీ వ‌ర్సెస్ బీసీల మ‌ధ్య పోరు సాగ‌నుంది. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాలు ఇంకా ఉన్నాయి.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju