TDP Media: ఏపీలో పలు మీడియా సంస్థల్లో కొన్ని అధికార వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా, మరికొన్ని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కనుకూలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వైసిపి అనుకూల మీడియా టీడీపీని టార్గెట్ చేస్తూ కథనాలు ఉండగా, టీడీపీ అనుకూల మీడియా అధికార వైసీపీని, ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపుతూ కథనాలు ఇస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై పోరుబాట ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని ప్రభుత్వ మీడియా హైలెట్ చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తోంది.
Read More: YSRCP: సీఎం జగన్ ను ఆ మాజీ ఎంపీ కలిసింది అందుకేనా? విజయసాయికి రెన్యువల్ ఉన్నట్లా..? లేనట్లా?
TDP Media: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు
ప్రభుత్వం కూడా ఆ సెక్షన్ మీడియాను ఇటీవల బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వంలోని ఒక మంత్రి నేరుగా ఆ మీడియా సంస్థలను బహిష్కరిస్తూ నట్టు వెల్లడించారు. దీంతో మీడియా మరింత రెచ్చిపోయి ఏ చిన్న అంశం దొరికిన దాన్ని హైలెట్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ఇస్తూ వస్తోంది. ఇప్పుడు పిఆర్సి విషయంలో ఉద్యోగ సంఘాలకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ఇస్తుంది ఆ మీడియా. ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి.. సీఎం జై జగన్ భేటీ అంశంపై మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను హైలెట్ చేస్తూ వాళ్ల మధ్య అగాధాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తోందని వార్తలు వినపడుతున్నాయి. సినీ పరిశ్రమ సమస్యలపై ఇటీవల సీఎం జగన్ తో చిరంజీవి మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. చిరంజీవే స్వయంగా చెప్పారు తాను సినీ పరిశ్రమకు సంబంధించి సమస్యలను సీఎం దృష్టికి తీసుకోవచ్చునని వెల్లడించారు.
చిరు జగన్ భేటీపై నాని వ్యాఖ్యలు
అయితే చిరంజీవి జగన్ బేటికి సంబంధించి మంత్రి పేర్ని నానిని మీడియా ప్రశ్నించగా… సీఎం జగన్ ఆహ్వానం మేరకు చిరంజీవి వచ్చి లంచ్ చేసి వెళ్ళినట్టుగా పేర్కొన్నారని, అంతకుమించి అక్కడ ఏమి చర్చ జరిగింది లేదంటూ కథనాలు వచ్చేయి. ఇదంతా కూడా ప్రభుత్వ వ్యతిరేక మీడియా చేస్తుందని వైసిపి ఆరోపిస్తుంది. ఇక్కడ మంత్రి నాని కూడా జగన్ చిరు బేటికి సంబంధించి అక్కడ ఇటువంటి చర్చలు జరిగాయి తనకు తెలియదు అని చెప్పి ఉంటే వివాదం వచ్చేది కాదేమో.