రేపో మాపో రఘురామకృష్ణంరాజుని వైసీపీ నుంచి సాగనంపుతారు..’ అనే చర్చ వైసీపీ వర్గాల్లోనే జరుగుతోంది. వైసీపీ నేతల్లోనే కొందరు ఈ తరహా లీకుల్ని మీడియాకి అందిస్తున్నారనే వాదనలూ లేకపోలేదు. ఇదిలా వుంటే, రఘురామకృష్నంరాజుని బయటకు పంపితే.. పార్టీ నుంచి ఇంకెవరైనా బయటకు వెళ్ళే పరిస్థితి వుంటుందా.? అన్న గుబులు కూడా వైసీపీ అధిష్టానంలో వున్నట్లే కన్పిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే పార్టీ అధిష్టానం, ఆయా నేతలపై నిఘా పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
రఘురామకృష్ణంరాజు దిష్టిబొమ్మలు దహనం చేసే కార్యక్రమాల్లో వేగం పెంచాయి వైసీపీ శ్రేణులు. పశ్చిమగోదావరి జిల్లాలో పలు చోట్ల ఆయన దిష్టిబొమ్మలు దహనమవుతున్నాయి. ‘
నిజానికి, కరోనా వైరస్ నేపథ్యంలో రోడ్ల మీద జనం గుంపులుగా తిరగడానికి వీల్లేదు.. రాజకీయ నిరసనలు చేయడానికి అసలే వీల్లేదు. కానీ, రఘురామకృష్నంరాజు మీద ‘మంట’కొద్దీ వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం చూపుతున్నాయి. పోలీసులు మాత్రం.. వారిపై చర్యలు తీసుకోలేకపోతున్నారనుకోండి.. అది వేరే సంగతి. ఇక, రఘురామకృష్ణంరాజు తాజా పరిణామాల్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు. ‘నేను ముఖ్యమంత్రి మీద ఇప్పటిదాకా విమర్శలు చేయలేదు.. చేయబోను కూడా. మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి.. ఆ మాటకే నేను కట్టుబడి వున్నాను..’ అని కుండబద్దలుగొట్టేస్తున్నారు రఘురామకృష్ణంరాజు తనదైన స్టయిల్లో.
కానీ, వైసీపీ శ్రేణులు మాత్రం, రఘురామకృష్ణంరాజుని మానసికంగా దూరం చేసేసుకున్నాయి. ఆయన్ని రాజకీయ ప్రత్యర్థిగా మాత్రమే చూస్తున్నాయి. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఆయన మీద చాలా గుర్రుగా వున్నారు. ఆయా ఎమ్మెల్యేలపై రఘురామకృష్ణంరాజు కూడా ఘాటైన విమర్శలు చేశారనుకోండి..పార్టీ నియమావళికి లోబడి ఎవరైనా వ్యవహరించాలి తప్ప, అదుపు కోల్పోకూడదు..’ అని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ పాయింట్ తోనే వైసీపీ నుండి రఘురామకృష్ణం రాజును బయటకు సాగనంప బోతున్నారు అన్నది రాజకీయ పరిశీలకుల అంచనా