పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారని తెలిసినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ లో ఉన్న ఆనందం అంతా ఇంతా కాదు. ఇక వకీల్ సాబ్ లాంటి సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉండాలో అంతకు మించే ఉన్నాయి. కెరీర్ లో మొదటిసారి పవర్ స్టార్ తన ఇమేజ్ ని పక్కన పెట్టి వకీల్ సాబ్ చేయడం కూడా ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికరమైన చర్చలకి తెరలేపింది. ఇక ఈ సినిమా నిర్మాత దిల్ రాజు పవర్ స్టార్ తో సినిమా చేయడమే అదృష్టంగా భావించి ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న కలని నెరవేర్చుకుంటున్నాడు.
ఈ క్రమంలోనే పవర్ స్టార్ తో వకీల్ సాబ్ ని తీస్తూ అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నాడు. ఈ సినిమాకి వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసందే. కొద్దిపాటి టాకీపార్ట్ తో పాటు ఒక డ్యూయట్ సాంగ్ ని జనవరిలో కంప్లీట్ చేయనున్నారట. కాగా తాజాగా వకీల్ సాబ్ కనీసం టీజర్ కూడా రిలీజ్ కాకముందే ఒక అరుదైన రికార్డ్ ని సాధించింది. 2020 లో అత్యధిక ట్వీట్స్ చేయబడిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. దాదాపు మూడేళ్ళ గ్యాప్ వచ్చినా కూడా పవర్ స్టార్ మ్యానియా ఏంటో వకీల్ సాబ్ శాంపిల్ చూపించాడు.
దీంతో ఇప్పుడు సినిమా మీద భారీగా అంచానాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో నిర్మాత దిల్ రాజు ఖచ్చితంగా చెప్పకపోవడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతున్నారట. కనీసం టీజర్.. ట్రైలర్ అన్న రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు. కాని ఆ ట్రీట్ కూడా దిల్ రాజు టీం ఇవ్వడం లేదు. చూడాలి మరి న్యూ ఇయర్ గిఫ్ట్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా. ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ లాయర్ గా కనిస్తుండగా శృతి హాసన్ గెస్ట్ రోల్ లో సందడి చేయనుంది. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్రలు పోషిస్తున్నారు.