తిరుపతిలో రైలు పట్టాలపై మంగళవారం జరిగిన పేలుడు కారణాలు తెలిసాయి. చిన్న నిర్లక్ష్యం వల్లనే పేలుడు జరిగింది అని పోలీసులు తేల్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన మహిళ గొర్రెలు కాపరి అని గుర్తించారు… ఎందువల్ల పేలుడు జరిగింది అంటే??
తారకరామా నగర్ సమీపంలోని రైల్వే ట్రాక్పై పేలుడు సంభవించింది. పట్టాలపై ఉన్న ఓ బాక్సును శశికళ అనే గేదెలు, గొర్రెల కాసుకునే మహిళ ఏముందో అని తెలుసుకునే లాగింది. దీంతో… భారీ శబ్ధంతో ఆ బాక్స్ పేలింది. రైలు పట్టాల దగ్గర్లో పేలుడు సంభావించడంతో కేసు ప్రాధాన్యత సంతరించుకుంది.
కారణాలు ఇవి!!
తిరుపతి. పేలుడుకు మొదట అమ్మోనియా నైట్రేట్ కారణమని భావించారు. అయితే పేలుడుకి మిథైల్ ఈథైల్ కీటో పేరాక్సైడ్ అనే రా మెటీరియల్ కాళీ డబ్బానే కారణంగా పోలీస్ దర్యాప్తు లో తేలింది. ట్రాక్ సమీపంలో ఉన్న బాలాజీ వెల్డింగ్ వర్క్స్ లో హీట్ రెసిస్టింగ్ పనుల కోసం దీన్ని డబ్బాల్లో తెస్తారు. అందులో (ఎం.ఈ.కే.పీ )మిథైల్ ఈథైల్ కీటో పేరాక్సైడ్ అనే రా మెటీరియల్ వాడతారు.
** అది పనుల తర్వాత డబ్బా ఖాళీ అవటం తో నిర్మానుష్య ప్రదేశం లో పడేశారు. దానిలో ఇంక ద్రావకం ఉన్న దాన్ని పనికి రాదు కాబట్టి ఓ పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేయకుండా చెత్తలో పడేసారు. ఇది కొన్ని రోజులుగా గాలి వెళ్లకుండా డబ్బా ఉండటంతో మహిళ దాన్ని తెరవగానే పెద్ద పేలుడు సంభావించింది.. దీని వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని, కేవలం నిర్లక్ష్యం మాత్రమే ఉందని పోలీసులు తేల్చ్చారు.
** దానిని జాగర్తగా డిస్పోజ్ చేయాల్సిన బాధ్యత వెల్డింగ్ పరిశ్రమదే. రా మెటీరియల్ వాడటానికి వాళ్ళకి లైసెన్స్ ఉంది. అయితే దాన్ని సక్రమంగా నిర్వీర్యం చేయకపోవడంతో సదరు యాజమాన్యం పై కేసు నమోదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే ఈ డబ్బా రైలు పట్టాల వద్దకు ఎలా వెళ్ళింది? దీన్ని అక్కడ యాజమాన్యం కావాలనే చేసిందా లేక చెత్త లో పడేసిన తర్వాత అది అక్కడికి వెళ్ళింద? అనేదానిపై తదుపరి దర్యాప్తులో పోలీసులు చేపట్టారు.