Budget 2024: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 – 25 ఆర్ధిక సంవత్సరానికి గానూ మద్యంతర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. రూ.47.66 లక్షల కోట్ల రూపాయల మధ్యంతర బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు, వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా నిర్ణయించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయింపులు ఇలా
- గ్రామీణ ఉపాధి హామీ పథకం : రూ.86వేల కోట్లు
- ఆయుష్మాన్ భారత్ : రూ.7,500 కోట్లు
- పారిశ్రామిక ప్రోత్సాహకాలు : రూ.6,200 కోట్లు
- సెమీ కండక్టర్స్, డిస్ ప్లే ఎకో వ్యవస్థల తయారీ : రూ.6,903 కోట్లు
- సోలార్ విద్యుత్ గ్రిడ్ : రూ.8,500 కోట్లు
- గ్రీన్ హైడ్రోజన్ మిషన్ : రూ.600 కోట్లు
వివిధ శాఖల కేటాయింపులు ఇలా
- రక్షణ : రూ.6.2 లక్షల కోట్లు
- ఉపరితల రవాణా, జాతీయ రహదారులు : రూ.2.78 లక్షల కోట్లు
- రైల్వే : రూ.2.55 లక్షల కోట్లు
- వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ : రూ.2.13 లక్షల కోట్లు
- హోంశాఖకు : రూ.2.03 కోట్లు
- గ్రామీణాభివృద్ధి : రూ.1.77 లక్షల కోట్లు
- రసాయనాలు, ఎరువులు : రూ.1.68 లక్షల కోట్లు
- కమ్యూనికేషన్లు : రూ.1.37 లక్షల కోట్లు
- వ్యవసాయం, రైతు సంక్షేమం : రూ.1.27 లక్షల కోట్లు
Budget 2024: ఆదాయ పన్ను యధాతధం