America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అగ్రరజ్యం అమెరికా పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామాన్ని కలిగి ఉన్న దేశం భారత్ అని అమెరికా పేర్కొంది. భారత్ ఎల్లప్పుడూ తమ ప్రాముఖ్యతతో కూడిన వ్యూహాత్మక భాగస్వామి అని తెలిపింది.
భారత్ – అమెరికా సంబంధాలపై యూఎస్ అధికార ప్రతినిధి మథ్యూ మిల్లర్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత తరుణంలో మిల్లర్ వ్యాఖ్యలు ప్రాధన్యత సంతరించుకున్నాయి. భారత్ ప్రజాస్వామ్యం వెనుకబాటు తనం, ప్రతిపక్షాలపై అణిచివేత ధోరణి సంబంధించి అమెరికా కీలక వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మీడియా అడిగిన ప్రశ్నలకు మిల్లర్ సమాధానం ఇచ్చారు.
భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. అమెరికాకు భారత్ చాలా ప్రాముఖ్యతతో కూడిన వ్యూహాత్మకమైన భాగస్వామి. ఇరు దేశాల బంధం సత్యమని నేను ఆశిస్తున్నా అని మిల్లర్ పేర్కొన్నారు. భారత్, అమెరికా సంబంధాలు ఎప్పుడూ వృద్ధి చెందాలని కోరుకుంటున్నామని తెలిపింది.
ఇటీవల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్టు, ఎన్నికల్లో ప్రజలు నిష్పక్షపాతంగా ఓటు వేయడానికి భారత్ లో సరైన పరిస్థితులు ఉంటాయని ఆశిస్తున్నామని ఆమెరికా వ్యాఖ్యానించిన విషయం విదితమే. అమెరికా చేసిన వ్యాఖ్యలను భారత్ ఆ సమయంలో ఖండించింది.
మరో పక్క యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ ఈ వారంలో తన భారత పర్యటన వాయిదా పడింది. పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో సుల్లివన్ భారత్ పర్యటన వాయిదా పడింది.
YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్