Vakeel Saab: పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం బ్లాక్బస్టర్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ రోజున అత్యధిక టికెట్ రేట్లను అరికట్టేందుకు కొత్త జీవో తీసుకువచ్చింది. సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం నిర్దేశించిన ధరల కే టికెట్లను అమ్మాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
అయితే దీనిపై డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కోర్టుకు వెళ్లగా రిలీజ్ రెండో రోజుకి హైకోర్టు ప్రభుత్వ నిర్ణయం పై స్టే విధించింది. దీంతో సినిమా రిలీజ్ అయిన రెండవ రోజు అధిక రేట్లకు టికెట్లను అమ్మడం జరిగింది. వెంటనే ఏపీ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
హై కోర్టు డివిజన్ కూడా ప్రభుత్వం వాదనకు మద్దతు ఇచ్చి ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే టికెట్లు నమ్మాలని కొద్దిసేపటి క్రితమే ఆదేశించింది. కాబట్టి ఈ చిత్రం టిక్కెట్లు తక్కువ రేటుకే అందరికీ అందుబాటులో ఉంటాయి. దీని పై పవన్ అభిమానులు పూర్తిస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.