సినిమాల్లో కాంబినేషన్లు చాలా ముఖ్యం. హీరో, హీరోయిన్ల పెయిర్, డ్యాన్సుల్లో అందం, పోటాపోటీ నటన.. ఇలాంటివి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తీసుకొస్తాయి. దీంతో సినిమాపై అంచనాలు పెరిగి బిజినెస్ వర్కౌట్ అవుతుంది. అటువంటి కాంబినేషన్లలో మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి పెయిర్ ఒకటి. దాదాపు 21 సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. 80 నుంచి 90 దశకం మొదటి అర్ధభాగం వరకూ వీరిద్దరిదీ టాలీవుడ్ సక్సెస్ పెయిర్. 1993లో వచ్చిన మెకానిక్ అల్లుడు వీరిద్దరూ కలసి నటించిన సినిమా. మళ్లీ వీరిద్దరూ కలిసి నటించే అవకాశాలు ఉన్నాయని ప్రేక్షకులు ఆశించారు. కానీ.. అందరి ఆశలపై విజయశాంత నీళ్లు జల్లేశారు.
ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇటివలే ఓ సినిమాలో నటించారు.. మళ్లీ సినిమాల్లో నటిస్తారా.. చిరంజీవితో నటిస్తారా? అని ఎదురైన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు. తనకు సినిమాల్లో నటించే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. చిరంజీవితో గానీ.. మరే హీరోతో కూడా నటించే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన దృష్టి రాజకీయాలపైనే ఉందన్నారు. తెలంగాణలో బీజీపీని బలోపేతం చేయడంపైనే తాను దృష్టి పెట్టినట్టు చెప్పుకొచ్చారు. దీంతో చిరంజీవి-విజయశాంతి మళ్లీ కలసి సినిమాల్లో కనిపిస్తారనే ఊహాగానాలకు తెరపడినట్టైంది. దీంతో వీరిద్దరి పోటాపోటీ నటన చూసే అవకాశం ఇక లేనట్టేనని చెప్పాలి.
ఈ ఏడాది మహేశ్ నటించి సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి నటించారు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చారు. ఆ ఫంక్షన్ లోనే చిరంజీవి-విజయశాంతి కలుసుకున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి ఒక వేదికపై కనిపించారని చెప్పాలి. ఆ సమయంలో వీరిద్దరూ ఒకరినొకరు తమ జ్ఞాపకాలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. వేదికపై వీరిద్దరూ చేసిన సందడి అందరినీ ఆకట్టుకుంది. మంచి అవకాశం వస్తే మళ్లీ సినిమాల్లో నటించే అంశం పరిశీలిస్తానని అన్నారు. కానీ.. ఆమె ఇటివల బీజేపీలో చేరడం, తెలంగాణలో బీజేపీ పుంజుకోవడంతో విజయశాంతి పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.