భారత జాతీయ జంతువు ఏదంటే మనకు ఠక్కున గుర్తొచ్చేది బెంగాల్ టైగర్. అవును… ఆ పులి ముఖం ఉన్న విమానంలోనే నమీబియా నుంచి భారత్ కు ఇవి కొన్ని దిగుబడి కానున్నాయి. ఈ ప్రత్యేక విమానం ఫోటోలను ఇండియన్ కమిషన్ తాజాగా విడుదల చేసింది. చీతాలను తీసుకురావటానికి ఇప్పటికే ఈ ప్రత్యేక విమానం నమీబియాకు చేరుకుందని ప్రస్తుతం తెలుస్తోంది. ఈ ప్రత్యేక విమానాన్ని ఇండియన్ కమిషన్ పులి ఫేస్ రూపంలో ఉన్న B747 జంబో జెట్ విమానం ఫోటోలను రిలీజ్ చేసింది. ఉత్తర ఆఫ్రికాలోని నమీబియా దేశం నుంచి దాదాపు 8 చీతాలను ఇండియాకు తీసుకురానున్నారు.
ఇక ఆ ప్రత్యేక విమానం ముఖ భాగాన్ని పులి ఫోటోతో డిజైన్ చేయడం ఇక్కడ కొసమెరుపు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తన ట్విట్టర్లో ఈ అంశంపై స్పందిస్తూ.. గుడ్విల్ అంబాసిడర్లకు వెల్కమ్ చెప్పేందుకు ఆతృతతో ఎదురుచూస్తున్నామని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసారు. కొన్ని దశాబ్ధాల తర్వాత దేశంలో మళ్లీ ఆ పులి గాండ్రింపులు ప్రకృతికి వినిపిస్తాయన్నారు. కాగా.. చీతాలు అంతరించినట్లు 1952లోనే ప్రభుత్వం ప్రకటించడం విశేషం. నమీబియా నుంచి తీసుకు వస్తున్న 8 చీతాలను మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కుకు తరలించనున్నారు.
ఈ చిరుతలను సెప్టెంబర్ 17వ తేదీన మోదీ తన బర్త్డే సందర్భంగా ఆ చీతాలను పార్కులోని ఎన్ క్లోజర్ లోకి విడుదల చేయనున్నారు. నమీబియా నుంచి తీసుకువచ్చే ఈ చీతాలు బాగా ఆకలితో రానున్నాయి. ఎందుకంటే చీతాలు ప్రయాణం అంతా ఖాళీ కడుపుతోనే సాగాలని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. విమానంలో చీతాలు ప్రయాణించనున్న తరుణంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఈ ప్రయాణంలో అవి ఖాళీ కడుపుతో వస్తేనే సురక్షితం అనీ లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయని అటవీశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.