దివంగత బీజేపీ నేత, రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబ సభ్యులను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం పరామర్శించారు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఇటీవల కృష్ణంరాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు గతంలో రెండు సార్లు బీజేపీ ఎంపిగా గెలిచారు. కేంద్ర మంత్రి గా బాధ్యతలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన రాజ్ నాథ్ సింగ్ .. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కే లక్ష్మణ్, సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డిలతో కలిసి జూబ్లిహిల్స్ లోని కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు.
కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, వారి కుమార్తెలతో పాటు, కృష్ణంరాజు సోదరుడి కుమారుడు, పముఖ సినీ హీరో ప్రభాస్ ను రాజ్ నాథ్ పరామర్శించారు. కొద్ది సేపు కుటుంబ సభ్యులతో ముచ్చటించిన రాజ్ నాథ్ సింగ్.. కృష్ణంరాజు మృతి పట్ల తన సానుభూతి తెలిపారు. అనంతరం ఫిలిమ్ నగర్ లో ఏర్పాటు చేసిన కృష్ణంరాజు సంస్మరణ సభలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు.
Breaking: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు ఈడీ నోటీసులు