Congress: అధికార వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పలువురు కీలక నేతలు వైసీపీని వీడుతున్నారు. ఈ పరిణామంపై ఆ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులను ఆందోళనకు గురి చేస్తుంది. ఇంతకు ముందు ఇద్దరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ లు కేటాయించింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలకు చెందిన వారే.
తాజాగా మరో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పార్టీకి రాజీనామా చేశారు. ఇవేళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో పార్టీలో చేరారు. ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితాలో పూతలపట్టు నియోజకవర్గానికి అభ్యర్ధిని ప్రకటించలేదు. దీంతో ఎంఎస్ బాబుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయి. షర్మిల ఆయనకు పార్టీ కండువా కప్పిసాదరంగా ఆహ్వానించారు.
మూడు నెలల క్రితం పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు స్థానంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జిగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను నియమించిన సందర్భంలోనే ఎంఎస్ బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయిదేళ్లు కష్టపడితే మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా అంటూ పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. దళిత ఎమ్మెల్యేలు అంటే అంత చిన్న చూపా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన పట్ల నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని చెప్పి టిక్కెట్ నిరాకరించారనీ, అదే ఓసి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా వారిని మార్చకుండా కేవలం దళిత ఎమ్మెల్యేలనే మారుస్తున్నారంటూ మండిపడ్డారు. ఆ తర్వాత నెల రోజులకు తాను పార్టీ మారతానని వస్తున్న వార్తల్లో నిజం లేదని, తాను వైసీపీలోనే కొనసాగుతానని చెప్పారు ఎంఎస్ బాబు. జగన్ తోనే ఉంటానని స్పష్టం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు మౌనంగా ఉన్న ఎంఎస్ బాబు .. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Breaking: ఛత్తీస్ఘడ్ సరిహద్దులో ఎన్ కౌంటర్ .. ముగ్గురు మావోయిస్టులు మృతి